ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: రాజ్యసభ పదవికి, వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీలు..

ABN, Publish Date - Aug 29 , 2024 | 01:04 PM

రాజ్యసభ పదవికి, వైసీపీకి మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాలను ఇరువురూ అందజేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాలను అందజేశారు.

ఢిల్లీ: రాజ్యసభ పదవికి, వైసీపీకి మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాలను ఇరువురూ అందజేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాలను అందజేశారు. అనంతరం వైసీపీకి సైతం రాజీనామా చేశారు. ఇద్దరు ఎంపీల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మోపిదేవి కుడి భుజంలా వ్యవహస్తే.. బీద మస్తాన్ రావుపార్టీలో కీలక వ్యవహరించారు. ఇప్పుడు వీరిద్దరూ పార్టీకి రాజీనామా చేయడంతో కేడర్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. నేతలే తమ దారి తాము చూసుకుంటుంటే తమ పరిస్థితేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇద్దరూ అటు పదవికి, ఇటు పార్టీకి ఏకకాలంలో రాజీనామా చేశారు. ఈమోపిదేవి, బీద మస్తాన్ రావులు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. నేటి మధ్యాహ్నం 12:30 గంటలకు రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్‌కు అందజేశారు.


రాజీనామాను సమర్పించడానికి ముందు మోపిదేవి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. వైసీపీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు.ఏ సందర్భంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నాను ఏమిటనేది వైసీపీ నేతలే ఆలోచించాలన్నారు. తాను తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో వైసీపీ వాళ్లే చెబుతారని అన్నారు. చిల్లరగా మాట్లాడే మనస్తత్వం తనది కాదని.. రాజ్యసభ పదవిపై తాను మొదటి నుంచి ఇంట్రెస్ట్ గా లేనన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో చేరుతానని మోపిదేవి వెంకట రమణ ప్రకటించారు. రాజకీయ వ్యవస్థను.. రాష్ట్ర పరిపాలన గాడిలో పెట్టాలని చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు కూడా తనతో చర్చించారని మోపిదేవి వెల్లడించారు.


రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గం వెళ్లి కార్యకర్తలతో సమావేశం అవుతానని మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రాజీనామా చేసిన తర్వాత తాను ఖాళీగా ఉండాలని అనుకోవడం లేదన్నారు. వైసీపీ అధినేత జగన్ తన వైఖరి మార్చుకోవాలన్నారు. పార్టీ మారుతున్న తనపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. గతంలో తనకు ఎలాంటి ఇబ్బందులు కలగజేసారో అందరికీ తెలుసని మోపిదేవి తెలిపారు. మొత్తానికి మోపిదేవి, బీద మస్తాన్ రావులు ముందుగా చెప్పినట్టుగానే రాజీనామా చేశారు. అయితే వీరి బాటలోనే మరికొందరు నేతలు ఉన్నారని సమాచారం. వారిలో అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, ఆర్‌.కృష్ణయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరంతా వైసీపీని వీడి టీడీపీ, బీజేపీ, జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని టాక్.


చంద్రబాబు మా బాస్: బీద మస్తాన్ రావు

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం బీద మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు బీద రవిచంద్ర కూడా టీడీపీలోనే ఉన్నాడన్నారు. మోపిదేవి వెంకటరమణ కిందిస్థాయి నుంచి వచ్చారన్నారు. చైర్మన్ ఫార్మాట్లోనే రాజీనామా చేశానన్నారు. రాబోయే రాజకీయ భవిష్యత్తుపై కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. చంద్రబాబు నాయుడు కలిశారని బీద మస్తాన్ రావును అడగ్గా... గతంలో చంద్రబాబు నాయుడు మా బాస్ అని సమాధానమిచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్ఛందంగా రాజీనామా చేశానని బీద మస్తాన్ రావు తెలిపారు.

Updated Date - Aug 29 , 2024 | 01:48 PM

Advertising
Advertising