ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Balineni Srinivas: త్వరలో అన్నీ విషయాలు బయట పెడతా.. బాలినేనిశ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Jul 16 , 2024 | 10:59 AM

మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మా పార్టీలో కూడా ఇబ్బందులు పడ్డా.. కొంతమంది బయటి వ్యక్తులతో కలసి మా వాళ్లే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించారు. త్వరలో అన్నీ విషయాలు బయట పెడతా’’ అని అన్నారు.

Balineni Srinivas

ప్రకాశం: మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మా పార్టీలో కూడా ఇబ్బందులు పడ్డా.. కొంతమంది బయటి వ్యక్తులతో కలసి మా వాళ్లే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించారు. త్వరలో అన్నీ విషయాలు బయట పెడతా’’ అని అన్నారు. వైఎస్ఆర్ మీద ఉన్న ప్రేమతో అన్నీ ఓర్చుకున్నానని, తాను హవాలా చేసినా, భూకబ్జాలు చేస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని, అన్నీ ఆరోపణలపై విచారణ జరపాలని అన్నారు.


రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా: బాలినేని

ఒక మాజీమంత్రిని, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తినే ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదని, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా అని బాలినేని అన్నారు. వ్యవస్థలను మోసం చేసిన చరిత్ర ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌‌దేనని ఆరోపించారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారని, ఒకరేమో చొక్కాలు విప్పి మాట్లాడుతున్నారని అన్నారు.

‘‘కొవ్వు దించుతా అంటున్నావు. ముందు నీకు ఎంత ఉందో చూసుకో. గత ఎన్నికల అనంతరం రెండేళ్లకు వచ్చావు. నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నేనే చెబుతా. అక్రమాల నిగ్గు తేల్చాలని నేనే అడిగితే మళ్లీ మీరేం మాట్లాడుతారు. నేను భూకబ్జాలు చేసి ఉంటే తేల్చాలని చెప్పాను. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దుర్మార్గంగా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మా అన్న సైట్ కొనుక్కున్నా బురద చల్లాలని చూశారు. నాకు కొలెస్ట్రాల్ లేదు. నీకు ఉంటే చెప్పు దించుతా. అధికార మదంతో మాట్లాడబాకు. పట్టాలు ఇస్తే దొంగ పట్టాలు అన్నారు. ఇప్పుడు తేల్చు. స్థలాల కొనుగోలు విషయంలో రైతుల దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నానని రుజువు చేస్తే దేనికైనా సిద్ధం. మా కోడలు మీద అక్రమ కేసులు పెట్టాలి అంటారు. నా కొడుకుతో తిరిగే వాళ్ళను గంజాయి బ్యాచ్ అంటారు. నేనైతే ప్రశ్నించే వాడ్ని’’ అని అన్నారు.


జగన్ గారు కరెక్ట్‌గా చేయక పోయినా ప్రశ్నించా

‘‘ఎప్పుడైనా ప్రశ్నిస్తూనే ఉంటా. జగన్ గారు కరెక్ట్‌గా చేయక పోయినా ప్రశ్నించాను. దాని వల్ల కొన్ని ఇబ్బందులు కూడా పడ్డా. సాప్ట్‌గా ఉండే నన్ను కొంతమంది ఇరిటేట్ చేస్తున్నారు. తప్పుగా మాట్లాడితే వెంటనే క్షమించమని అడిగా. 1973లోనే మాకు సొంత కారు ఉంది. మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. 1973 సమయానికి మీ కుటుంబ పరిస్థితి ఏంటి. అధికార మదంతో మమ్మల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు’’ అని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి

అమరావతి బ్రాండ్ బస్సులను పునరుద్దరిస్తాం

ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు సమావేశం

For AP News and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 11:04 AM

Advertising
Advertising
<