ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srikakulam Dist.,: అరసవిల్లిలో భక్తులకు కనువిందు చేసిన అద్భుత దృశ్యం...

ABN, Publish Date - Oct 02 , 2024 | 07:23 AM

అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్టును సూర్యకిరణాలు నేరుగా తాకాయి. లేలేత సూర్య కిరణాల స్పర్శతో స్వామి వారి మూలవిరాట్ దేదీప్యమానంగా వెలుగొందింది. రెండు నిమిషాలు పాటు సూర్య కిరణాలు స్వామి వారి మూల విరాట్‌ను తాకాయి. ఈ అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది.

శ్రీకాకుళం జిల్లా: అరసవిల్లి (Arasavalli)లో అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది. శ్రీ సూర్యనారాయణ స్వామి (Sri Suryanarayana Swamy) క్షేత్రంలో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయంలోని రెండవ రోజు బుధవారం ఉదయం స్వామి వారి మూలవిరాట్టును సూర్యకిరణాలు (Sun Rays) నేరుగా తాకాయి. లేలేత సూర్య కిరణాల స్పర్శతో స్వామి వారి మూలవిరాట్ దేదీప్యమానంగా వెలుగొందింది. రెండు నిమిషాలు పాటు సూర్య కిరణాలు స్వామి వారి మూల విరాట్‌ను తాకాయి. ఈ అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రతి ఏటా దక్షిణాయంలో అక్టోబర్ 1, 2 తేదీలు, ఉత్తరాయణంలో మార్చి 9,10 తేదీల్లో మూల విరాట్‌ను సూర్యకిరణాలు నేరుగా తాకుతాయి.


ప్రత్యక్షదైవం.. ఆరోగ్యప్రదాత.. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని ఉదయభానుని లేలేత కిరణాలు తాకాయి. ఈ అపురూప ఘట్టం మొదటి రోజు మంగళవారం ఉదయం ఆవిష్కృతమైంది. ఉదయం 6.05 నిమిషాలకు సూర్యకిరణాలు గోపురాన్ని దాటుకుంటూ అనివెట్టి మండపం, ధ్వజస్తంబం మీదుగా, ఆలయ పంచద్వారాలను దాటుకుంటూ, గర్భగుడిలోని స్వామి మూలవిరాట్‌ను తాకాయి. ఈ కమనీయ దృశ్యాన్ని అధిక సంఖ్యలో భక్తులు వీక్షించి.. పులకించారు. ఓం నమో సూర్యదేవాయ అనే నామస్మరణ మార్మోగింది. రెండేళ్లుగా వాతావరణంలో మబ్బుల కారణంగా ఆదిత్యుడికి కిరణాలు స్పశించేవి కాదు. దీంతో భక్తులు నిరాశ చెందేవారు. ఈ సారి మాత్రం కిరణాలు తాకడంతో స్వామి స్వర్ణ కాంతులతో దర్శనమిచ్చారని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ ఏటా మార్చి నెల 9, 10 తేదీల్లో, అక్టోబరు 1, 2 తేదీల్లో స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకుతాయని తెలిపారు. ఈసారి కిరణస్పర్శతో అత్యంత ప్రకాశవంతంగా స్వామి దర్శనమిచ్చారన్నారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ కనకరాజు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


మంగళవారం ఉదయం ఆరు గ౦టల 20 నిమిషాల సమయంలో బంగారు రంగులో లేలేత కిరణాలు సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌పై ఆరు నిమిషాల పాటు ప్రకాశించాయి. ఆలయ గోపురం నుండి గర్బ గుడిలోని స్వామివారి మూల విరాట్‌కు మధ్య దూరం 350 అడుగులు ఉంటుంది. అ౦త దూరంలో ఉన్న మూల విరాట్‌ను ఐదు ద్వార బ౦దాలు దాటుకు౦టూ సూర్య కిరణాలు నేరుగా వచ్చి తాకట౦ భక్తులు స్వామివారి మహిమగానే భావిస్తారు.ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్లి౦చే౦దుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారు జామున మూడు గ౦టల నుండే క్యూలైన్లలో భారులు తీరారు.

ఆదిత్యుని విగ్రహంపై పడిన లేలేత కిరణాలు దర్శనమివ్వడంతో జన్మధన్యమైందంటూ భక్తులు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. సూర్యకిరణాలు తాకే సమయానికి సూర్యనారాయణమూర్తిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఏటా రెండు సార్లు సూర్య కిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి. అరసవిల్లి దేవాలయంలోని మూల విరాట్‌ని సూర్యకిరణాలు తాకటం ఓ అద్భుతమనే చెప్పాలి. ఈ అద్భుత ఘట్టాన్ని కల్లారా చూసిన వారికి ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఆలయ ప్రాకారం నుండి మూడు విరాట్ కు సుమారు 350 అడుగుల దూరం ఉంటుంది. ఆలయ ప్రాకారాలను, మండపాన్ని , ద్వజ స్తంభాన్ని దాటుకొని సూర్య కిరణాలు స్వామి వారి విగ్రహంపై పడతాయి. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులకు ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధించి వారు ఆనందంగా ఉంటారనేది భక్తుల నమ్మకము. అందుకనే ఈ సుందర ఘట్టాన్ని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అరసవల్లికి తరలివస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సూపర్ 6 అమలు చేస్తాం

600 వైద్య పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 02 , 2024 | 07:40 AM