ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada : ‘ఎవరు గెలిచినా మీదే గెలుపు’

ABN, Publish Date - Jun 28 , 2024 | 05:14 AM

‘ఎవరు గెలిచినా మీదే గెలుపు’ పేరుతో ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన పోటీలో రాష్ట్రస్థాయి విజేత వీరపనేని ముసలయ్య బహుమతి మొ త్తాన్ని అందుకున్నారు.

  • విజేతకు బహుమతి ప్రదానం

విజయవాడ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి):‘ఎవరు గెలిచినా మీదే గెలుపు’ పేరుతో ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన పోటీలో రాష్ట్రస్థాయి విజేత వీరపనేని ముసలయ్య బహుమతి మొత్తాన్ని అందుకున్నారు. ఈ ఎన్నికల్లో కూటమికి 164 స్థానా లు వస్తాయని, వైసీపీ 11 స్థానాలతో సరిపెట్టుకుంటుందని మొత్తం 13 మంది ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులు వందశాతం కచ్చితత్వంతో అంచ నా వేశారు.

రాష్ట్రస్థాయిలో తొలి బహుమతి లక్ష రూపాయలుకాగా... ‘డ్రా’లో విజయవాడకు చెందిన ముసలయ్యకు ఆ అదృష్టం వరించింది. గురువారం విజయవాడలోని ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయంలో బ్రాంచ్‌ మేనేజర్‌ మురళి ముసలయ్యకు బహుమతికి సంబంధించిన చెక్కును అందించారు. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన ఆయన ఆర్టీసీ బస్టాండ్‌ పార్కింగ్‌లో ఉద్యోగిగా పని చేస్తున్నారు.

‘‘ఇరవై ఏళ్లుగా ఆంధ్రజ్యోతి పాఠకుడిని. రాజకీయాలంటే బాగా ఆసక్తి. వైసీపీకి ఘోర పరాజయం తప్పదని, కూటమి ఘన విజయం సాధిస్తుందని అంచనా వేశాను. డ్రాలో మొదటి బహుమతి రావడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని ముసలయ్య పేర్కొన్నారు.

Updated Date - Jun 28 , 2024 | 05:14 AM

Advertising
Advertising