ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Paytm: పేటీఎంకు మరో దెబ్బ.. సెబీ నోటీస్ నేపథ్యంలో షేర్లు ఏకంగా..

ABN, Publish Date - Aug 26 , 2024 | 04:24 PM

Paytm షేర్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో దాదాపు 9% పడిపోయి ఒక దశలో షేరు ధర రూ.505.25కి చేరుకున్నాయి. అయితే ఈ షేర్లు ఆకస్మాత్తుగా ఎందుకు పడిపోయాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Paytm shares fall

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) సోమవారం(ఆగస్టు 26న) పాజిటివ్ ధోరణిలో ఉన్నప్పటికీ పేటీఎం షేర్లు మాత్రం పెద్ద ఎత్తున నష్టపోయాయి. ఈ క్రమంలో సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో Paytm షేర్లు దాదాపు 9% పడిపోయి ఒక దశలో షేరు ధర రూ.505.25కి చేరుకున్నాయి. అయితే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి పేటీఎం సీఈవోకు షోకాజ్ నోటీసు అందడమే ఇందుకు కారణం. మీడియా నివేదికల ప్రకారం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) CEO విజయ్ శేఖర్ శర్మ, బోర్డు సభ్యులకు సెబీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. నవంబర్ 2021లో Paytm IPO సమయంలో ప్రమోటర్ వర్గీకరణ నిబంధనలను పాటించలేదనే విషయంలో షోకాజ్ నోటీసును సెబీ పంపించింది.


రిజర్వ్ బ్యాంక్

Paytmకి జారీ చేయబడిన ఈ నోటీసు ప్రమోటర్ వర్గీకరణ నియమాలను పాటించలేదని ఆరోపించిన విషయానికి సంబంధించినది. నివేదిక ప్రకారం రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ దర్యాప్తు ప్రారంభించబడింది. Paytm పేమెంట్స్ బ్యాంక్ విచారణ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది ప్రారంభంలో కఠిన చర్యలు తీసుకుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నోటీసు తప్పుడు సమాచారాన్ని అందించిన కేసుకు సంబంధించినది. Paytm ఐపీఓ నవంబర్ 2021లో వచ్చింది.


సెబీ

విజయ్ శేఖర్ శర్మ కోట్లకు యజమాని అని పేటీఎం తన ఐపీఓను ప్రారంభించినప్పుడు, వాస్తవాలను తప్పుగా చూపించారని సెబీ ఆరోపించింది. IPO పత్రాలలో విజయ్ శేఖర్ శర్మ ప్రమోటర్లుగా వర్గీకరించబడి ఉండాలా లేదా అని నిర్ధారించడానికి దర్యాప్తు ప్రయత్నిస్తోంది. దీని కారణంగా ఇప్పుడు రెగ్యులేటరీ అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిణామం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రభావితం చేసింది. దీంతో Paytm షేర్ల ధరలలో మళ్లీ పతనం మొదలైంది. 2024లో ఇప్పటివరకు ఈ స్టాక్ 18 శాతానికిపైగా పడిపోయింది. శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే Paytm షేర్లు 9 శాతం పడిపోవడం విశేషం.


నిబంధనల ప్రకారం

కంపెనీ ఐపీఓ వచ్చినప్పుడు ఆయన కేవలం ఒక ఉద్యోగి కాకుండా నిర్వహణపై నియంత్రణను కలిగి ఉన్నాడు. అందుకే సెబీ అప్పటి డైరెక్టర్లకు కూడా నోటీసులు జారీ చేసింది. విజయ్ శేఖర్ శర్మ చేసిన ఈ చర్యకు ఎందుకు మద్దతు ఇచ్చారని సెబీ తన నోటీసులో వారిని ప్రశ్నించింది. సెబీ నిబంధనల ప్రకారం విజయ్ శేఖర్ శర్మను ప్రమోటర్లు ఆఫర్ చేసి ఉంటే ఆయన ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ (ఈఎస్‌ఓపీ)కు అర్హత పొంది ఉండేవాడు కాదు. వృత్తిపరంగా నిర్వహించబడాలంటే ఏ కంపెనీలో ఏ ఒక్క వాటాదారుడు 10 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండకూడదు. లేదా ఏ ఒక్క వాటాదారుకు నియంత్రణ ఉండకూడదు. ఆయన ప్రస్తుతం 19.4 శాతం వాటాలను కల్గి ఉన్నారు.


భారీ పతనం

శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే ఈరోజు బీఎస్‌ఈలో Paytm షేర్లు రూ.560 వద్ద ప్రారంభమయ్యాయి. కొంత కాలం తర్వాత కంపెనీ షేర్లు ఇంట్రా డే గరిష్ట స్థాయి రూ.565.45కి చేరాయి. దీని తర్వాత షేర్లలో భారీ పతనం చోటుచేసుకుంది. సోమవారం ఇంట్రా డే గరిష్ఠ స్థాయి నుంచి 11.91 శాతం క్షీణతతో షేర్లు ఇంట్రా డే కనిష్ట స్థాయి రూ.505.25కి చేరాయి.


ఇవి కూడా చదవండి:

RBI: ఇకపై క్షణాల్లోనే లోన్స్.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ

Lowest Interest Car Loans: తక్కువ రేటుకే లక్షల రూపాయల కార్ లోన్స్.. ఈ వివరాలు తెలుసా మీకు..


Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 26 , 2024 | 04:26 PM

Advertising
Advertising
<