ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bangalore: ఏపీలో సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి టీడీపీ..

ABN, Publish Date - Jan 13 , 2024 | 01:44 PM

ఏపీలో తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రాబోతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ మీడియా కో-ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్సీ గుణపాటి దీపక్‌రెడ్డి చెప్పారు.

బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): ఏపీలో తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రాబోతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ మీడియా కో-ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్సీ గుణపాటి దీపక్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుత వైఎస్సార్‌ ప్రభుత్వంపై ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. నారా లోకేష్‌(Nara Lokesh) బాబు పాదయాత్ర, యువగళం కార్యక్రమంలో ప్రజలు అన్ని చోట్లా ఆయనకు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. జగన్‌ మోహన్‌రెడ్డి దోపిడీలు, దౌర్యన్యాలకు ఏపీ ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. శుక్రవారం బళ్లారిలోని దుర్గామాతను ఆయన దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాయదుర్గం నియోజక వర్గంలో మాజీ జెడ్పీ చైర్మన్‌ పూల నాగరాజు ఆహ్వానం మేరకు అక్కడ అమ్మవారి పూజలకు వెళుతున్నట్లు తెలిపారు. రాయదుర్గం నియోజక వర్గంలో టీడీపీ కార్యకర్తలు బలంగా ఉన్నారన్నారు. రాయదుర్గం శాసనసభ నుంచి పోటీ చేయడానికి టికెట్‌ ఆశిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా తాను ఇప్పటి వరకూ ఏమీ అనుకోలేదని తమ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ ఏమి ఆదేశించినా శిరసావహిస్తామని తెలిపారు. ఆయన వెంట బుడుగు నాగేశ్వరరావు, ప్రకాష్, మాజీమేయర్‌గుర్రం రమణ, మోహన్‌దా్‌స, తదితర కార్యకర్తలు. నాయకులు ఉన్నారు.

Updated Date - Jan 13 , 2024 | 01:44 PM

Advertising
Advertising