ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RG Kar Hospital: హత్యాచారం కేసులో సీబీఐ కీలక పురోగతి

ABN, Publish Date - Aug 22 , 2024 | 08:34 PM

ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ గురువారం కీలక పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తోపాటు మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐకి కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కోల్‌కత్తా, ఆగస్ట్ 22: ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ గురువారం కీలక పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తోపాటు మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐకి కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Also Read: Hyderabad: ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ

ఆగస్ట్ 9వ తేదీ తెల్లవారుజామున ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన చోటు చేసుకుంది. ఆ రోజు డాక్టర్ సందీప్ ఘోష్‌తోపాటు మరో నలుగురు వైద్యులు విధుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు కోల్‌కతా హైకోర్టును సీబీఐ అనుమతి కోరింది. సీబీఐ అభ్యర్థన పట్ల కోల్‌కతా హైకోర్టు సానుకూలంగా స్పందించింది.

Also Read: Hyderabad: సీఎం రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ భేటీ


మరోవైపు ఈ కేసులో ఇప్పటికే కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర సందీప్ ఘోష్‌ను సీబీఐ ప్రశ్నించింది. ట్రైయినీ వైద్యురాలి మృతి చెందిన అనంతరం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ వ్యవహార శైలిపై సీబీఐ సందేహాలు వ్యక్తం చేసింది. ఇంకా చెప్పాలంటే.. ఈ ఘటన అనంతరం ఆయన పలువురని సంప్రదించినట్లు సమాచారం. అలాగే బాధితురాలి తల్లిదండ్రులను ఆమె మృతదేహాన్ని చూడడానికి అనుమతించడంలో ఆయన తీవ్ర జాప్యాన్ని ప్రదర్శించారని తెలుస్తుంది. కుమార్తె మృతదేహాన్ని చూసేందుకు వారు ఆసుపత్రి వద్ద దాదాపు 3 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఓ ప్రచారం సైతం సాగింది.

Also Read: Hyderabad City: నడి రోడ్డుపై యువకుడి నిర్వాకం.. ఏం చేశాడంటే..?

Also Read: Ayodhya: ఎస్పీ నేతకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘మార్క్ ట్రీట్‌మెంట్’


అందుకు గల కారణాలేమిటంటూ డాక్టర్ సందీప్ ఘోష్‌‌ను ఇప్పటికే సీబీఐ ప్రశ్నలు సంధించింది. ఆ క్రమంలో ఆయనతోపాటు మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ నిర్ణయించినట్లు తెలుస్తుంది. హత్యాచార ఘటన అనంతరం దీనిని కప్పిపుచ్చుకోవడానికి స్థానిక పోలీసులు ప్రయత్నించారంటూ సుప్రీంకోర్టులో ఇప్పటికే సీబీఐ ఆరోపించిన విషయం విధితమే.

Also Read: Beerla Ilaiah: ‘రైతు రుణ మాఫీ చూసి బీఆర్ఎస్ నేతల మతి భ్రమించింది’

Also Read: అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు


అదీకాక.. ఈ హత్యాచార ఘటన జరిగిన రెండు రోజులకు కాలేజీ ప్రిన్సిపాల్ పదవికి ప్రొ. సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో పదవిలో నియమించింది. ఈ ఘటనపై ఆయన స్పందించారు. మృతురాలు తన కుమార్తె వంటిదని ఆయన అభివర్ణించారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకూడదని ఎక్స్ వేదికగా ప్రొ. సందీప్ ఘోష్ ఆకాంక్షించిన సంగతి తెలిసిందే.

Read More Telangana News and atest Telugu News

Updated Date - Aug 22 , 2024 | 09:31 PM

Advertising
Advertising
<