ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

UPSC aspirants death: కోచింగ్ సెంటర్ యాజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ABN, Publish Date - Jul 28 , 2024 | 03:27 PM

సెంట్రల్ ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించడం, విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో పోలీసులు తక్షణ చర్యలకు దిగారు. స్టడీ సర్కిల్ యజమాని, కోఆర్డినేటర్‌ను ఆదివారంనాడు అదుపులోనికి తీసుకున్నారు.

న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ (IAS coaching centre) లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించడం, విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో పోలీసులు తక్షణ చర్యలకు దిగారు. స్టడీ సర్కిల్ యజమాని, కోఆర్డినేటర్‌ను ఆదివారంనాడు అదుపులోనికి తీసుకున్నారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌, బిల్డింగ్ మేనేజిమెంట్‌, ఆ ప్రాంతంలో డ్రైనేజ్ మేనేజిమెంట్‌కు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సెంట్రల్ ఎం.వర్షవర్ధన్ తెలిపారు. బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 105, 106(1), 115(2), 35 కింద కేసులు పెట్టామని, ఇంతవరకూ కోచింగ్ సెంటర్ యజమాని, కోఆర్డినేటర్‌ను నిర్బంధంలోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నామని చెప్పారు.


ఓల్డ్ రాజేంద్రనగర్ కోచింగ్ సెంటర్‌లో వరద పోటెత్తి మరణించిన విద్యార్థులు ముగ్గురిని పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరిని ఉత్తరప్రదేశ్‌‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాకు చెందిన శ్రేయా యాదవ్, మరొకరిని తెలంగాణకు చెందిన తాన్యా సోని, మూడో వ్యక్తిని కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నెవిన్ డాల్విన్‌గా గుర్తించారు. ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్యయంతో రెస్యూ ఆపరేషన్ నిర్వహించి కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్ నుంచి ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురునీ గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేసినట్టు డీసీపీ తెలిపారు. విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి పంపారు

Delhi: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. స్వాతిమాలివాల్‌కి చేదు అనుభవం


కాగా, విద్యార్థుల మృతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరనలకు దిగిన విద్యార్థులను అడిషినల్ డిప్యూటీ కమిషనర్ సచిన్ శర్మ ఆదివారం ఉదయం కలిసి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారని, ఏ విషయాన్ని తాము దాచిపెట్టమని, చట్టబద్ధంగా అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని, విచారణ జరుగుతోందని చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఐఏఎస్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ బాధ్యతారాహిత్యంపై విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యురాలు స్వాతిమలివాల్ సైతం ఘటనా స్థలికి వెళ్లి విద్యార్థుల ఆందోళనలకు సంఘీభావం ప్రకటించారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 28 , 2024 | 03:27 PM

Advertising
Advertising
<