ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: ఇలా తయారయ్యారేంట్రా.. జ్యూస్‌లో మూత్రం కలిపి..

ABN, Publish Date - Sep 14 , 2024 | 03:25 PM

బయట ఏదైనా తినాలన్నా భయపడేలా చేస్తు్న్నారు కొందరు ప్రబుద్ధులు. ఐస్‌క్రీంలో వీర్యం కలిపి అమ్ముతున్న వ్యక్తిని తెలంగాణ పోలీసులు ఆ మధ్య అదుపులోకి తీసుకున్నారు. జ్యూస్‌లో మూత్రం కలుపుతున్న బాలుడిని యూపీ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

ఘజియాబాద్: బయట ఏదైనా తినాలన్నా భయపడేలా చేస్తు్న్నారు కొందరు ప్రబుద్ధులు. ఐస్‌క్రీంలో వీర్యం కలిపి అమ్ముతున్న వ్యక్తిని తెలంగాణ పోలీసులు ఆ మధ్య అదుపులోకి తీసుకున్నారు. జ్యూస్‌లో మూత్రం కలుపుతున్న బాలుడిని యూపీ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. విరక్తిపుట్టించే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. నగరంలోని ఓ జ్యూస్ సెంటర్ వద్ద బాలుడు పండ్ల రసాల్లో మూత్రం కలుపుతున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పండ్ల రసాల్లో మూత్రాన్ని కలిపి వినియోగదారులకు అందిస్తున్నట్లు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

అనంతరం బాలుడితోపాటు అతని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. వారి జ్యూస్ స్టాల్‌లో తనిఖీ చేసి మూత్రంతో నిండిన ప్లాస్టిక్ చెరకును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అమీర్‌‌గా గుర్తించినట్లు ఏసీపీ అంకుర్ విహార్ భాస్కర్ వర్మ తెలిపారు. బాలుడి తండ్రిని విచారించగా.. పొంతన లేని సమాధానం చెబుతున్నట్లు విహార్ భాస్కర్ తెలిపారు. అనంతరం ఇరువురిని అదుపులోకి తీసుకున్నామన్నారు.


బయట ఫుడ్ సురక్షితమేనా..

స్నేహితులను కలిసిన, బంధుమిత్రులతో పార్టీలకు వెళ్లిన ఎక్కువగా బయటే తినడానికి ఇష్టపడతాం. మరి బయట ఆహారం ఎంత వరకు సేఫ్. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. వరంగల్ జిల్లాలో ఐస్‌క్రీమ్‌లో వీర్యం, మూత్రాన్ని కలుపుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ దారుణాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఓ వ్యక్తి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో సదరు ప్రబుద్ధున్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వరంగల్‌ జిల్లా నెక్కొండలో రాజస్థాన్‌కు చెందిన కాలురాం పుర్బియా అనే వ్యక్తి ఐస్‌క్రీమ్‌ బండి పెట్టుకున్నాడు.

అంబేద్కర్‌ కూడలిలో రోజూ ఐస్‌క్రీమ్‌లు విక్రయిస్తుంటాడు. బహిరంగంగానే తన వీర్యాన్ని, మూత్రాన్ని ఐస్‌క్రీమ్‌లో కలుపుతుండగా ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఇది రాత్రి వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్సై మహేందర్‌ విచారణ చేపట్టి బహిరంగ ప్రదేశంలో హేయమైన చర్యకు పాల్పడ్డ కాలురాం పుర్బియాను మంగళవారం అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బయటపడినవి రెండు సంఘటనలు మాత్రమే. సో బయట ఆహారం తినేముందు చాలా జాగ్రత్తగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు.

For Latest News and National News click here

Updated Date - Sep 14 , 2024 | 04:16 PM

Advertising
Advertising