ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: గర్భిణీ అనే కనికరం లేకుండా.. కదులుతున్న బస్సు నుంచి భార్యను తోసేశాడు..

ABN, Publish Date - Jan 31 , 2024 | 10:55 AM

సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే విచక్షణరహితంగా పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన

సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే విచక్షణరహితంగా పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. కడదాకా కలిసి ఉండాల్సిన భర్త తన భార్యను కర్కశంగా కడతేర్చాడు. గర్భిణీ అనే కనికరం కూడా లేకుండా కదులుతున్న బస్సులో నుంచి కిందికి తోసేశాడు. దీంతో తీవ్ర గాయాలతో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. చెన్నైలో జరిగిన ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. తమిళనాడులోని వెంబార్‌పట్టికి చెందిన పాండియన్‌కు, కల్‌వెలిపట్టికి చెందిన వళర్మతికి ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. వళర్మతి ప్రస్తుతం అయిదునెలల గర్భవతి.

భార్యాభర్తలిద్దరూ కల్‌వెలిపట్టి వెళ్లేందుకు బస్సు ఎక్కారు. ఆ సమయంలో పాండియన్‌ మద్యం మత్తులో ఉన్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర కోపోద్రిక్తుడైన పాండియన్ తన భార్యను బస్సులోంచి తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పాండియన్ ను అరెస్ట్‌ చేశారు.

"మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 31 , 2024 | 10:59 AM

Advertising
Advertising