ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NEET row: 0.001 నిర్లక్ష్యం ఉన్నా వెంటనే పరిష్కరించాలి.. ఎన్‌టీఏపై మండిపడిన 'సుప్రీం'

ABN, Publish Date - Jun 18 , 2024 | 04:12 PM

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన 'నీట్' పరీక్షల్లో అవకతవకలు జరగడం, పేకర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పరీక్షలు నిర్వహిస్తున్న జాతీయ పరీక్ష మండలిపై మండిపడింది. నీట్-యూజీ, 2024 పరీక్షల్లో ఎక్కడైనా 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా దాన్ని సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన 'నీట్' పరీక్షల్లో అవకతవకలు జరగడం, పేకర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) సీరియస్ అయింది. పరీక్షలు నిర్వహిస్తున్న జాతీయ పరీక్ష మండలి (NTA)పై మండిపడింది. నీట్-యూజీ, 2024 పరీక్షల్లో ఎక్కడైనా 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా దాన్ని సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేసింది. పరీక్షలు నిర్వహిస్తున్న సంస్థగా ఎక్కడ నిర్లక్ష్యం ఉన్నా న్యాయంగా వ్యవహరించాలని, తప్పిదం జరిగితే జరిగిందని అంగీకరించాలని, చర్యలు తీసుకున్నామని వివరించాలని ఎన్టీఏకు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ఎస్‌వీఎన్ భట్టితో కూడిన వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది.


పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పడే శ్రమను మరిచిపోకూడదని, పరీక్షలు నిర్వహిస్తున్న ఏజెన్సీగా ఎన్‌టీఏ న్యాయబద్ధంగా వ్యవహరించాలని ధర్మాసనం పేర్కొంది. ''పొరపాటు జరిగితే కనీసం ఫలానా చర్య తీసుకున్నామని చెప్పినా అది మీ పనితీరుపై విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఎన్డీఏ నుంచి సకాలంలో సరైన చర్యలను ఆశిస్తున్నాం'' అని తెలిపింది. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది.


నీట్ పరీక్షను గత మే 5న దేశవ్యాప్తంగా ఉన్న 4,750 కేంద్రాల్లో నిర్వహించగా, 24 లక్షల మంది హాజరయ్యారు. జూన్ 14న ఫలితాలు వెలువడతాయని అంచనా వేసినప్పటికీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీన ఫలితాలను ప్రకటించారు. పరీక్ష పేపర్లు దిద్దడం ఇంతకుముందే పూర్తి కావడంతో ఫలితాలను విడుదల చేశారు. అయితే, బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయిందని, పలు చోట్లు అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఎంబీబీఎస్, ఇతర కోర్సులలో అడ్మిషన్ కోసం పరీక్షలు రాసిన 1,563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం, ఎన్‌టీఏ గత గురువారంనాడు విన్నవించాయి.

Updated Date - Jun 18 , 2024 | 04:12 PM

Advertising
Advertising