ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైలును పట్టాలు తప్పించేందుకు ట్రాక్‌పై సిలిండర్‌

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:02 AM

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రె స్‌కు పెను ప్రమాదం తప్పింది. ప్రయాగ్‌రాజ్‌ నుంచి హరియాణాలోని భివాని వెళ్తున్న ఈ రైలు ఆదివారం రాత్రి శివరాజ్‌పూర్‌ సమీపంలో పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌ను అతి వేగంగా ఢీ కొట్టింది.

కాన్పూర్‌, సెప్టెంబరు 9: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రె స్‌కు పెను ప్రమాదం తప్పింది. ప్రయాగ్‌రాజ్‌ నుంచి హరియాణాలోని భివాని వెళ్తున్న ఈ రైలు ఆదివారం రాత్రి శివరాజ్‌పూర్‌ సమీపంలో పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌ను అతి వేగంగా ఢీ కొట్టింది. సిలిండర్‌ పేలక పోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. లోకోపైలెట్‌ విషయాన్ని గార్డుకు తెలపగా అతడు రైల్వే పోలీసులకు సమాచారాన్ని అందించాడు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పట్టాల సమీపంలో గ్యాస్‌ సిలిండర్‌తో పాటు పెట్రోల్‌ బాటిల్‌ను, అగ్గిపెట్టను స్వాధీనం చేసుకున్నారు. రైలును పట్టాలు తప్పించే కుట్రతోనే గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే ట్రాక్‌పై సిలిండర్‌ను పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - Sep 10 , 2024 | 03:02 AM

Advertising
Advertising