ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata RG Kar Hospital: ట్రైయినీ వైద్యురాలి పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు

ABN, Publish Date - Aug 14 , 2024 | 04:07 PM

ట్రైయినీ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని డాక్టర్ సుభర్ణ గోస్వామి వెల్లడించారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ సుభర్ణ గోస్వామి మాట్లాడారు. ఆమె శరీరంలో 151 గ్రాముల ద్రవ పదార్థం ఉందన్నారు. ఒక్కరే లైంగిక దాడికి పాల్పడితే.. అంత ద్రవ పదార్థం ఆమె శరీరంలో ఉండదని తెలిపారు.

కోల్‌కతా, ఆగస్ట్ 14: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే ఈ ఘటనపై డాక్టర్ సుభర్ణ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సామూహిక అత్యాచారం.. ఇదిగో సాక్ష్యం..

ట్రైయినీ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని వెల్లడించారు. బుధవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ సుభర్ణ గోస్వామి మాట్లాడుతూ.. ఆమె శరీరంలో 151 గ్రాముల ద్రవ పదార్థం ఉందన్నారు. ఒక్కరే లైంగిక దాడికి పాల్పడితే.. అంత ద్రవ పదార్థం ఆమె శరీరంలో ఉండదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని స్పష్టమవుతుందని తెలిపారు. ఈ హత్యాచార ఘటనలో పలువురు ప్రమేయం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

Also Read: Jammu Kashmir Encounter: ఆర్మీ అధికారి మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం..!


ఈ ఘటనలో ఒక్కరే అరెస్ట్...

ఇదే విషయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులు సైతం స్పష్టం చేశారని డాక్టర్ గోస్వామి గుర్తు చేశారు. అలాగే ఆమె శరీరంపై గాయాలు సైతం ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్క వ్యక్తి మాత్రమే అయితే.. ఆమెను అంతలా గాయం చేసే అవకాశాలు అయితే లేవని స్పష్టం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున అంటే.. ఆగస్ట్ 9 తేదీన సెమినార్ హాల్‌లో నగ్నంగా పడి ఉన్న పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ట్రైయినీ విద్యార్థిని మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.


కోల్‌కతా చేరుకున్న సీబీఐ అధికారులు..

మరోవైపు ఈ హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. దాంతో సీబీఐ అధికారులు బుధవారం కోల్‌కత్తాలోని ఆర్ జీ కర్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆసుపత్రి ఉన్నతాధికారులతో సీబీఐ అధికారులు సమావేశమయ్యారు. అదీకాక.. ఈ హత్యాచారం కేసులో పోస్ట్‌మార్టం నివేదికతోపాటు ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో ఆ యా ప్రాంతంలోని సీసీ ఫుటేజ్‌లను బహిర్గతం చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్న విషయం విధితమే.


నాలుగు పేజీల పోస్ట‌మార్టం నివేదికలో ఏముందంటే..

ట్రైయినీ వైద్యురాలి గొంతు కోసి హత్య చేశారు. దాంతో ఆమె థైరాయిడ్ భాగంలోని మృదులాస్థితి విరిగిపోయింది. అలాగే ఆమె మృతదేహంలోని ప్రైవేట్ భాగాల్లో సైతం గాయాలు స్పష్టంగా కనిపించాయి. అదే విధంగా పెదవులు, వేళ్లు, ఎడమ కాలుపై భాగంలో సైతం గాయాలను గుర్తించారు. ఆమె కళ్లతోపాటు నోటి నుంచి సైతం రక్తం కారిన విషయాన్ని ఈ నివేదికలో స్పష్టం చేశారు. లైంగిక దాడి జరిగినప్పుడు బిగ్గరగా అరవకుండా.. ఆమె నోటిని గట్టిగా బిగించారు. దీంతో ఆమె ఊపిరాడని పరిస్థితిలోకి వెళ్లారు. అలాగే ఆమె తల భాగాన్ని గోడకు కొట్టినట్లుగా ఈ నివేదికలో స్పష్టమైంది. ముఖంపై గీతలు సైతం కనిపించాయి. లైంగిక దాడి చేసే క్రమంలో ఆమెను తీవ్రంగా హింసించినట్లు పోస్ట్‌మార్టం నివేదిక సైతం స్పష్టం చేసింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 14 , 2024 | 04:50 PM

Advertising
Advertising
<