ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NEET UG: నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా.. కారణం అదే

ABN, Publish Date - Jul 06 , 2024 | 12:59 PM

నీట్ పేపర్ లీకేజీ, అందులో జరిగిన అక్రమాలపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరగనున్న నేపథ్యంలో నేడు(శనివారం) జరగాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్‌ని వాయిదా వేస్తూ మెడికల్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ, అందులో జరిగిన అక్రమాలపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరగనున్న నేపథ్యంలో నేడు(శనివారం) జరగాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్‌ని వాయిదా వేస్తూ మెడికల్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు కౌన్సిలింగ్ వాయిదా పడినట్లు వివరించింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కౌన్సిలింగ్ పై బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


అయితే కౌన్సెలింగ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఎన్‌టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్‌ లీక్‌ అయ్యాయన్న ఆరోపణలు వినిపించాయి.

దీనికి తోడు విడుదల చేసిన ఫలితాల్లో ఏకంగా 60కిపైగా అభ్యర్థులకు ఫస్ట్ ర్యాంక్ రావడంతో పేపర్ లీక్ అనుమానాలు బలపడ్డాయి. వీటితోపాటు అవకతవకలకు సంబంధించిన వివిధ కారణాలతో సుప్రీం కోర్టులో 26 పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో నీట్ కౌన్సిలింగ్ చేయకూడదని సుప్రీం కోర్టు నిర్ణయించింది.


నీట్ రద్దు చేయొద్దంటూ 'సుప్రీం'కు వినతి..

మరోవైపు నీట్‌ యూజీ పరీక్షను రద్దు చేయొద్దని.. అలా చేస్తే నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. నీట్‌ పరీక్ష నిర్వహణలో భారీ మొత్తంలో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని.. ఆ పరీక్షను రద్దు చేసి కొత్తగా పరీక్ష నిర్వహించడం హేతుబద్థం కాదని స్పష్టం చేసింది. అలా నిజాయతీగా పరీక్ష రాసిన లక్షలాది విద్యార్థుల ప్రయోజనాలను కాపాడడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. నీట్‌ యూజీ ప్రశ్నాపత్రాల లీకేజీ సహా పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై.. కేంద్ర విద్యా శాఖ శుక్రవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది. నీట్‌ అక్రమాలపై సమగ్ర దర్యాప్తునకు సీబీఐని ఆదేశించినట్లు అందులో పేర్కొంది.


అలాగే.. ఈ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఎజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్యర్యంలో పరీక్షలను సమర్థంగా, సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలిపింది. కేంద్రం బాటలోనే.. ఎన్‌టీఏ కూడా నీట్‌ పరీక్ష రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ పరీక్షను ఎలాంటి అక్రమాలకూ తావులేకుండా జరిపామని.. మాల్‌ప్రాక్టీస్‌ జరిగినట్టు వస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని.. పట్నా, గోధ్రాలోని కేంద్రాలలో మాత్రమే అక్రమాలు జరిగాయని పేర్కొంది. వ్యక్తిగత సంఘటనల ఆధారంగా మొత్తం పరీక్షను రద్దు చేయొద్దని ఎన్‌టీఏ విజ్ఞప్తి చేసింది.

అలా రద్దు చేయడం వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందని.. మరీ ముఖ్యంగా అర్హులైన అభ్యర్థుల కెరీర్‌ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా.. నీట్‌ అక్రమాలపై దాఖలైన పిటిషన్లపై.. సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పర్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ నెల 8న విచారణ జరపనుంది.

For Latest News and National News click here

Updated Date - Jul 06 , 2024 | 01:06 PM

Advertising
Advertising
<