ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Parliament Session: 'నీట్'పై నిలదీసిన రాహుల్.. దాపరికాలేవీ లేవన్న ధర్మేంద్ర ప్రధాన్

ABN, Publish Date - Jul 22 , 2024 | 03:17 PM

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజే 'నీట్' పేపర్ లీక్ అంశంపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి. పేపర్ లీక్ అనేది తీవ్రమైన సమస్య అని, దీనికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, ప్రభుత్వానికి ఎలాంటి దాపరికారాలు లేవని అన్నారు.

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Parliament Budget Session) ప్రారంభం రోజే 'నీట్' (NEET) పేపర్ లీక్ అంశంపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి. పేపర్ లీక్ అనేది తీవ్రమైన సమస్య అని, దీనికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, ప్రభుత్వానికి ఎలాంటి దాపరికారాలు లేవని అన్నారు.


ప్రశ్నోత్తరాల సమయంలో 'నీట్' పరీక్షా పత్రం లీకేజీ అంశాన్ని రాహుల్ లేవనెత్తుతూ, పేపర్ లీక్‌పై మంత్రి (ధర్మేంద్ర ప్రధాన్) తనను తప్ప అందరినీ నిందించారని అన్నారు. 'నీట్‌' విషయంలోనే కాకుండా మన పరీక్షా విధానంలో చాలా తీవ్రమైన సమస్య ఉందని యావద్దేశానికి స్పష్టంగా అర్ధమైందని, అయితే మంత్రి మాత్రం తనను తాను మినహాయించుకుని అందరినీ నిందించారని అన్నారు. అసలిక్కడ ఏమి జరుగుతోందో దాని మౌలిక సూత్రాలను కూడా ఆయన అర్ధం చేసుకున్నట్టు తనకు అనిపించడం లేదన్నారు. పశ్నాపత్రాల లీకేజీ వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, దేశంలో పరీక్షల వ్యవహారం మొత్తం ఒక 'ఫ్రాడ్'గా మారిందన్నారు. డబ్బున్నోళ్లు విద్యావ్యవస్థను కొనేస్తున్నారని లక్షలాది మంది ప్రజలు నమ్ముతున్నారని, విపక్షాల అభిప్రాయం కూడా ఇదేనని స్పష్టం చేశారు.

PM Modi: రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాన్ని నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నించారు: మోదీ


లీకేజీల్లో రికార్డు...

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రశ్నాపత్రాల లీకేజీలో ప్రభుత్వం రికార్డు సృష్టించిందని అన్నారు. కొన్ని సెంటర్లలో 2000 మందికి పైగా పాసయ్యారని, విద్యాశాఖ మంత్రి (ధర్మేంద్ర ప్రధాన్) ఇక్కడ ఉన్నంతవరకూ విద్యార్థులకు న్యాయం జరగదని అన్నారు.


ఏడేళ్లుగా లీకేజీ దాఖలాలు లేవు.. మంత్రి

నీట్ ప్రశ్నాపత్నం లీకేజీ వ్యవహారంపై విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, ప్రభుత్వం ఏదీ దాచిపెట్టడం లేదని, నిజానిజాలను సుప్రీంకోర్టుకు తెలియజేసిందని, ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉందని చెప్పారు. కోర్టు ఇచ్చే ఆదేశాల గురించి మనం ఎదురుచూద్దామని చెప్పారు. ఈ ఏడాది మే 5న నీట్-యూజీ పరీక్ష జరిగినప్పుడు పాట్నాలో పేపర్ లీక్ చోటుచేసుకోవడం మినహా గత ఏడేళ్లలో ఎలాంటి పేపర్ లీకేజీలు లేవన్నారు. ప్రస్తుతం నీట్ పేపర్ లేకేజీ వ్యవహారంపై సీజేఐ నేతృత్వంలో విచారణ జరుగుతున్నందున వాస్తవాలన్నీ బయటకు వస్తాయని చెప్పారు. ఎన్‌టీఏ ఏర్పాటు చేసినప్పటి నుంచి 240కి పైగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని, 5 కోట్ల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 4.5 కోట్ల మంది పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు.

For Latest News and National News click here

Updated Date - Jul 22 , 2024 | 03:21 PM

Advertising
Advertising
<