ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Narendra Modi-Putin: ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక చర్చలు

ABN, Publish Date - Aug 27 , 2024 | 04:33 PM

భారత్‌కు మిత్ర దేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (మంగళవారం) మాట్లాడారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రధాని మోదీ ఇటీవల ఉక్రెయిన్ పర్యటనపై కూడా చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

న్యూఢిల్లీ: భారత్‌కు మిత్ర దేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (మంగళవారం) మాట్లాడారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇటీవల ముగిసిన ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనపై కూడా చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

‘‘ అధ్యక్షుడు పుతిన్‌తో ఈ రోజు మాట్లాడాను. ఇరుదేశాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుకున్నాం. రష్యా-ఉక్రెయిన్ వివాదంతో పాటు ఇటీవలే నేను ఉక్రెయిన్‌లో పర్యటించడంతో నా ఆలోచనలను కూడా పంచుకున్నాను. ఈ వివాదాన్ని శాంతియుత, వీలైనంత త్వరగా పరిష్కరించుకునేందుకు భారత్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని నేను పునరుద్ఘాటించాను’’ అని మోదీ వివరించారు. ఈ మేరకు ఈ రోజు ఇరువురూ ఫోన్‌లో సంభాషించుకున్నారు.


అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ చర్చపై కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. భారత్-రష్యా మధ్య 22వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు గత నెలలో ముగిసిన తన రష్యా పర్యటనను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారని తెలిపింది. ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాల్లో పురోగతిని సమీక్షించారని వివరించింది. భారత్, రష్యా మధ్య ప్రత్యేకమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుకున్నారని వివరించింది. పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై అభిప్రాయాలను కూడా పంచుకున్నారని ప్రకటనలో కేంద్రం పేర్కొంది.


మరోవైపు ఎడతెగకుండా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారని ప్రకటనలో కేంద్రం వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తన ఉక్రెయిన్ పర్యటనకు సంబంధించిన తన ఆలోచనలను పుతిన్‌తో పంచుకున్నారు. సంబంధిత భాగస్వాములు అందరూ శాంతికి కట్టుబడి ఆచరణాత్మక చర్చలు జరపాలని మోదీ సూచించారు.


కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్య ఉక్రెయిన్‌లో పర్యటించారు. రష్యాతో వివాదంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ చట్టాలకు లోబడి సహకారానికి సంసిద్ధమంటూ ఇరుదేశాధినేతలు అంగీకరించారని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Aug 27 , 2024 | 04:36 PM

Advertising
Advertising
<