ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Prashant Kishor: జన్‌ సురాజ్ పార్టీని అధికారికంగా ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్

ABN, Publish Date - Oct 02 , 2024 | 05:54 PM

జన్ సురాజ్‌ను ''జన్ సురాజ్ పార్టీ''గా ఎన్నికల కమిషన్ అధికారికంగా ఈరోజు ఆమోదించిందని పాట్నాలో జరిగిన కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

పాట్నా: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ క్యాంపెయిన్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) అధికారికంగా "జన్ సురాజ్ పార్టీ'' (Jan Suraj Party)ని బుధవారంనాడు ప్రారంభించారు. పాట్నాలోని బీహార్ వెటర్నరీ కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ సందర్భంగా భారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జన్ సురాజ్‌ను ''జన్ సురాజ్ పార్టీ''గా ఎన్నికల కమిషన్ అధికారికంగా ఈరోజు ఆమోదించిందని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. రెండుమూడేళ్లుగా జన్ సురాజ్ ప్రచారం సాగిస్తున్నామని, అధికారికంగా ఎప్పుడు పార్టీని తెస్తారంటూ ప్రజలు అడుగుతూ వచ్చారని, అది ఈరోజు సాకారమైందని, అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు.


లిక్కర్‌పై నిషేధం ఎత్తివేస్తాం...

జన్ సురాజ్ పార్టీ అధికారంలోకి వస్తే బీహార్‌లో మద్యనిషేధాన్ని ఎత్తివేస్తామని పీకే ప్రకటించారు. బీహార్‌ను ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రాబోయే పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అవసరమని చెప్పారు. లిక్కర్‌పై నిషేధం ఎత్తివేయడం ద్వారా వచ్చే సొమ్మును బడ్జెట్‌కు కానీ, నేతల భద్రతకు కానీ, రోడ్లు, నీళ్లు, విద్యుత్‌కు మళ్లించమని, బీహార్‌లో కొత్త విద్యా వ్యవస్థ నిర్మాణానికి మాత్రమే ఖర్చు చేస్తామని చెప్పారు. లిక్కర్‌పై నిషేధం వల్ల ఏటా రూ.20,000 కోట్లు బీహార్‌కు నష్టం వస్తోందని చెప్పారు.

Video Viral: వరద నీటిలో ఐఏఎఫ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. పైలెట్లు సురక్షితం


ఇటీవల జరిగి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారని, నాయకులు తమ ఇష్టానుసారం వ్యవహరించడాన్ని కానీ, వారి అహంకారాన్ని కానీ ఎంతమాత్రం ప్రజలు సహించేది లేదనే స్పష్టత ఇచ్చారని ప్రశాంత్ కిషోర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పొలిటికల్ కన్సెల్టెన్సీ వైపు తిరిగి వెళ్లేది లేదని, బీహార్‌ సామాజిక-ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచేందుకే తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.


జన్ సురాజ్‌ పార్టీలో చేరిన ప్రముఖులు

జన్ సురాజ్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా పలువురు నేతలు ఆ పార్టీలో చేరారు. యాదవ కమ్యూనిటీ నుంచి కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రసాద్ యాదవ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లలన్ యాదవ్, ఓబీసీ వర్గం నుంచి రిటైర్డ్ ఐఆర్‌టీఎస్ అధికారి మహేంద్ర మెహతా, ముస్లిం వర్గం నుంచి శరణ్ జిల్లా ఎమ్మెల్సీ అఫీఖ్ అహ్మద్, మహిళా నేత మాళవికా రాజ్ వంటి ప్రముఖులు పార్టీలో చేరారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం

Haryana Polls: హరియాణా బీజేపీ.. ముచ్చటగా మూడోసారికి, ఆ మూడే కీలకం

Varanasi: ఆలయాల వద్ద ఉద్రిక్తత.. సాయిబాబా విగ్రహాల తొలగింపు

Updated Date - Oct 02 , 2024 | 05:56 PM