ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: సుప్రీంకోర్ట్ యూట్యూబ్ ఛానెల్ హ్యాకింగ్.. తర్వాత ఏమైందంటే

ABN, Publish Date - Sep 20 , 2024 | 01:05 PM

సైబర్ నేరగాళ్లు ఏకంగా సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేశారు. దీంతో ఆ ఛానెల్లో ఇప్పుడు "సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా"కి బదులుగా "రిప్పల్" అనే క్రిప్ర్టో కరెన్సీ కనిపిస్తోంది. ఆ తర్వాత ఏమైందనే వివరాలను ఇక్కడ చుద్దాం.

Supreme Court YouTube hacked

దేశంలో హ్యాకర్ల చేష్టలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే నేడు హ్యాకర్లు ఏకంగా సుప్రీంకోర్టు(Supreme Court) అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేశారు. సమాచారం ప్రకారం ఇప్పుడు భారత సుప్రీంకోర్టు స్థానంలో అమెరికాలోని Ripple ల్యాబ్స్‌కు చెందిన XRP అనే క్రిప్టో కరెన్సీ యాడ్స్ కనిపిస్తున్నాయి. గతంలో సుప్రీంకోర్టుకు సంబంధించిన వీడియోలు ఈ ఛానెల్‌లో కనిపించగా, ఇప్పుడు మొత్తం ఛానెల్లో క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వీడియోలు దర్శనమిస్తున్నాయి.


హ్యాకర్లు

ఈ యూట్యూబ్ ఛానెల్లో రాజ్యాంగ ధర్మాసనాల్లో విచారణ జరుగుతున్న కేసుల విచారణ, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఇటీవల ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన అత్యాచారం, హత్య కేసులో సూమోటో పిటిషన్‌పై విచారణ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. అయితే ఆ వీడియోలను హ్యాకర్లు ప్రైవేట్‌గా మార్చారు. ఇప్పుడు యూట్యూబ్‌లో సుప్రీంకోర్ట్ ఛానెల్ వీడియోను ఓపెన్ చేసినప్పుడు ఏమీ కనిపించడం లేదు. మీరు ఇప్పుడు యూట్యూబ్‌కి వెళ్లి సుప్రీంకోర్ట్ అని వ్రాస్తే ఛానెల్ చూపిస్తోంది. కానీ దానిపై క్లిక్ చేస్తే పేజీ అందుబాటులో లేదు. అందుకు క్షమించాలని వస్తుంది. వేరొకదాని కోసం వెతకడానికి ప్రయత్నించాలని సూచిస్తుంది.


గత కొన్ని నెలలుగా

స్కామర్లు మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న ప్రసిద్ధ యూట్యూబర్‌లను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్కామర్లు ఆ ఖాతాల నుంచి వారికి సంబంధించిన వీడియోలను ప్రమోట్ చేస్తున్నారు. ది వెర్జ్ కథనం ప్రకారం గత కొన్ని నెలలుగా ఈ స్కామ్ జరుగుతోంది. స్కామర్లు చిన్న ప్రారంభ పెట్టుబడుల కోసం XRPలో భారీ రాబడులు చేయాలని ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఆ క్రమంలో చాలా మంది ప్రజలు వీటి గురించి పూర్తిగా తెలియక తమ డబ్బును పెట్టుబడిగా పెట్టి నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానెల్ హ్యాకింగ్‌పై అప్రమత్తమైన సుప్రీంకోర్టు పరిపాలన దర్యాప్తు చేస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి.


పునరుద్ధరణ

అయితే యూట్యూబ్ ఛానెల్ హ్యాకింగ్ గురించి మాత్రం సుప్రీంకోర్టు వర్గాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వెంటనే అప్రమత్తమైన సంబంధిత విభాగం సిబ్బంది యూట్యూబ్ ఛానెల్‌ను పునరుద్ధరించారు. కానీ ఈ హ్యాకింగ్ ఎవరు చేశారనే విషయం తెలియాల్సి ఉంది.

ప్రత్యక్ష ప్రసారం

రాజ్యాంగ బెంచ్‌ల ముందు జాబితా చేయబడిన కేసుల విచారణలు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీంకోర్టు ఈ YouTubeని ఉపయోగిస్తోంది. అప్పటి CJI UU లలిత్ నేతృత్వంలో ఇటీవలి ఫుల్ కోర్ట్ సమావేశం తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయంలో 2018లో ఈ అంశంపై సంచలనాత్మక తీర్పును అనుసరించి అన్ని రాజ్యాంగ ధర్మాసనం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.


ఇవి కూడా చదవండి:

Land For Job Scam: జాబ్స్ స్కాం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో షాక్.. మళ్లీ జైలుకు తప్పదా


Viral Video: ఐఫోన్ 16 కోసం 20 గంటలు లైన్లో వేచిఉన్న ప్రజలు


Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Read MoreNational News and Latest Telugu News

Updated Date - Sep 20 , 2024 | 01:37 PM