ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం

ABN, Publish Date - Apr 05 , 2024 | 12:23 PM

వైసీపీ డీఎన్‌ఏలోనే శవ రాజకీయం ఉందని, వాళ్ల వారసత్వమే శవ రాజకీయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. 2024లో జగన్‌ మళ్లీ శవ రాజకీయం మొదలు పెట్టారని, వైసీపీ శవాల కోసం వెతుకుతోందని దుయ్యబట్టారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నల్లజర్లలో గురువారం నిర్వహించిన ప్రజాగళం సభలో అశేష జనాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘జగన్‌రెడ్డిది శవరాజకీయం. ఎవరైనా మంచి పనిచేసి నాకు ఓటేయమని అడుగుతారు. కొంతమంది మనుషులను చంపేసి ఎదుటివాళ్ల పైకినెట్టి ఓటు వేయమని అడుగుతారు. జగన్‌ తండ్రి హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయారు. కానీ తన తండ్రిని చంపేశారని జగన్‌ అన్నారు. రిలయన్స్‌ అధినేత చంపేశారని కూడా అన్నారు. వాళ్ల షాపులపైన దాడులు కూడా చేశారు. మళ్లీ అదే రిలయన్స్‌ అధినేత మనిషికి ఎంపీ సీటు ఇచ్చారు. 2014లో తండ్రి లేని బిడ్డనంటూ ఓటు వేయమని అడిగారు. ఈ రాష్ట్రం కోసం చంద్రబాబు తప్ప ఎవ్వరూ వద్దని నన్ను గెలిపించారు. 2019లో మళ్లీ శవ రాజకీయంపైకి వచ్చింది. ముందు కోడికత్తి డ్రామా, ఆ తరువాత బాబాయిపై గొడ్డలి వేటుపడింది. ‘మా నాన్న చనిపోయాడు. ఉన్న ఒక్క బాబాయిని కూడా చంపేశారు. నారాసుర రక్తచరిత్ర’ అని కూడా జగన్‌ చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి ఇప్పుటికైనా నిజం చెప్పు.. హూ కిల్డ్‌ బాబాయి?’’ అని చంద్రబాబు మండిపడ్డారు.

1/5

తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్లలో జరిగిన ప్రజాగళం సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు..

2/5

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో జరిగిన ప్రజాగళం సభకు పెద్ద ఎత్తున హాజరైన కార్యకర్తలు, అభిమానులు..

3/5

తూర్పుగోదావరి జిల్లా, గోపాలపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు..

4/5

నిజం గెలవాలి పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లా, గోపాలపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు మండుటెండను కూడా లెక్క చేయకుండా విచ్చేసిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు..

5/5

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తూ.గో. జిల్లా, గోపాలపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో మాట్లాడుతున్న టీడీపీ నేత.

Updated Date - Apr 05 , 2024 | 12:27 PM

Advertising
Advertising