పిఠాపురం: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజక వర్గంలోని యు. కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల్లో మంగళవారం పర్యటించారు. మహిళలు, రైతులు, కార్మికులు, యువత.. ఇలా వివిధ వర్గాల వారిని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వారితో కూర్చుని వారికి ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ప్రజల సమస్య లు పరిష్కరిస్తానని, నియోజవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ముందుకు సాగారు.