ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జైపాల్ రెడ్డి సంస్మరణ సభ దృశ్యాలు..

ABN, Publish Date - Jul 29 , 2024 | 11:18 AM

నాగర్ కర్నూల్ జిల్లా: కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్‌ నేత సూదిని జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదివారం కల్వకుర్తి పట్టణంలో సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వెల్దండ మండలం, కొట్ర గేటు వద్ద హైదరాబాద్‌ – శ్రీశైలం జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన జైపాల్ రెడ్డి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

1/9

కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి దివంగత సూదిని జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదివారం కల్వకుర్తి పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు..

2/9

హైదరాబాద్‌ – శ్రీశైలం జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన జైపాల్ రెడ్డి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన దృశ్యం..

3/9

కేంద్ర మాజీ మంత్రి దివంగత సూదిని జైపాల్‌రెడ్డి సంస్మరణ సభలో పాల్గొని ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

4/9

కేంద్ర మాజీ మంత్రి దివంగత సూదిని జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. వేదికపై ఆశీనులైన మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక కాంగ్రెస్ నేతలు..

5/9

నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి పట్టణానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం..

6/9

కేంద్ర మాజీ మంత్రి దివంగత సూదిని జైపాల్‌రెడ్డి సంస్మరణ సభలో పాల్గొని ప్రసంగిస్తున్న మంత్రి దామోదర రాజనర్శింహ..

7/9

దివంగత సూదిని జైపాల్‌రెడ్డి సంస్మరణ సభలో పాల్గొని ప్రసంగిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు..

8/9

కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి దివంగత సూదిని జైపాల్‌రెడ్డి వర్ధంతి సభలో ప్రసంగిస్తున్న నాగర్ కర్నూల్ లోక్‌సభ ఎంపీ మల్లు రవి..

9/9

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి దివంగత సూదిని జైపాల్‌రెడ్డి సంస్మరణ సభకు పెద్ద సంఖ్యలో విచ్చేసిన జనం..

Updated Date - Jul 29 , 2024 | 11:18 AM

Advertising
Advertising