ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కివి పండును ఎవరు తింటే మంచిదో తెలుసా?

ABN, Publish Date - Sep 16 , 2024 | 01:30 PM

పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఒక్కో పండు కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్న పండ్లలో కివి పండు కూడా ఉంది. ధర ఎక్కువే అయినా దీని లాభాలు చాలా ఎక్కువ అని ఆహార నిపుణులు అంటున్నారు.

1/9

కివి పండును 8 రకాల వ్యక్తులు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.

2/9

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు కివి పండును తింటే రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో విటమిన్-సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

3/9

కివి పండులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. జీర్ణసమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కివి పండును తింటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.

4/9

గుండె పోటును నియంత్రించడంలో కూడా కివి సహాయపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది.

5/9

కివి లో విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా ఉండాలని అనుకునే వారు కివి తింటే మంచిది.

6/9

కివిలో లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలోో సహాయపడతాయి.

7/9

కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కివి తింటే బరువు తగ్గుతారు. అధిక బరువుతో ఇబ్బంది పడేవారు కివి తీసుకుంటే మంచిది.

8/9

కివిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు కివి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

9/9

కివిలో ఉండే పోషకాలు ఆస్తమా రోగులకు చాలా మేలు చేస్తాయి. ఆస్తమా ఉన్నవారు కివి తీసుకోవచ్చు.

Updated Date - Sep 16 , 2024 | 01:30 PM

Advertising
Advertising