ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఇంటికి వెళ్తూ తమలపాకులు తినాలన్న కోరిక.. అతడి నేరాలన్నింటినీ బయట పెట్టింది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Jan 28 , 2024 | 07:36 PM

దొంగలు చాలా తెలివిగా నేరాలు చేస్తుంటారు. టెక్నాలజీ అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ చాలా మంది నేరస్థులు పోలీసులకు దొరక్కుండా చాకచక్యంగా చోరీలకు పాల్పడుతుంటారు. అయితే...

ప్రతీకాత్మక చిత్రం

దొంగలు చాలా తెలివిగా నేరాలు చేస్తుంటారు. టెక్నాలజీ అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ చాలా మంది నేరస్థులు పోలీసులకు దొరక్కుండా చాకచక్యంగా చోరీలకు పాల్పడుతుంటారు. అయితే ఎంతటి తెలివిగల నేరస్థుడు అయినా ఎక్కడో చోట పప్పులో కాలేస్తుంటాడు. చివరకు ఏదో ఒక రోజు పోలీసులకు దొరికిపోతుంటాడు. ఇలాంటి విచిత్ర నేరాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ దొంగకు తమలపాకులు తినాలన్న కోరిక చివరకు అతడిని కటకటాలపాలు చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) గునాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ధరత సింగ్ అనే వ్యక్తి చోరీలు చేయడం వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఇటీవల ఓ రోజు రాత్రి అతను ఇదే ప్రాంతంలోని ఓ డెయిరీ సంస్థలో (theft in Dairy company ) నూనె డబ్బాలు,ల్యాప్‪‌టాప్, పెన్‌డ్రైవ్ తదితరాలను చోరీ చేశాడు. ఇలా అదే రోజు రాత్రి మొత్తం ఐదుకి పైగా దుకాణాల్లో చోరీకి పాల్పడ్డాడు. అయితే ఇంటికి వెళ్లే క్రమంలో అతడికి తమలపాకులు తినాలని కోరిక పుట్టింది. దీంతో వెంటనే ఓ పాన్ డబ్బాను టార్గెట్ చేశాడు.

Viral Video: వామ్మో! చివరకు ఇలా అయ్యిందేంటీ.. గడ్డకట్టే చలిలో వేడి వేడి న్యూడిల్స్‌తో వింత ప్రయోగం..

పాన్ డబ్బాలో ఉన్న మొత్తం 28 తమలపాలకుల కట్టలను (Theft of betel leaves) తీసుకున్నాడు. అలాగే సిగరెట్ ప్యాకెట్లను కూడా ఎత్తుకెళ్లాడు. ఉదయం పాన్ డబ్బాలో చోరీ జరిగిందన్న విషయం తెలుసుకున్న యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. చివరకు ధరమ్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. మొత్తం నేరాలన్నీ వెలుగులోకి వచ్చాయి. నిందితుడు చాలా తెలివిగా నేరాలకు పాల్పడడం చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: ఎలాగైనా బతకాలన్న ఒకే ఒక్క కోరికతో.. ఈ పంది చివరకు పెద్ద సాహసమే చేసిందిగా..

Updated Date - Jan 28 , 2024 | 07:36 PM

Advertising
Advertising