ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: మొబైల్ లాక్కున్నందుకు ఇంత దారుణమా? భర్తకు కరెంట్ షాక్ ఇచ్చిన భార్య ఎంతలా పగ తీర్చుకుందంటే..

ABN, Publish Date - May 31 , 2024 | 11:30 AM

ప్రస్తుతం చిన్నా, పెద్దా లేకుండా అందరూ మొబైల్స్‌కు బానిసలుగా మారిపోయారు. సోషల్ మీడియా వీక్షించడం లేదా మొబైల్స్‌లో గంటల తరబడి మాట్లాడడం వంటివి చేస్తూ కుటుంబ సభ్యులకు చికాకు తెప్పిస్తున్నారు. ఎవరైనా సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తే సైకోలుగా మారి విపరీతంగా ప్రవర్తిస్తున్నారు.

mobile phone

ప్రస్తుతం చిన్నా, పెద్దా లేకుండా అందరూ మొబైల్స్‌కు (Mobiles) బానిసలుగా మారిపోయారు. సోషల్ మీడియా వీక్షించడం లేదా మొబైల్స్‌లో గంటల తరబడి మాట్లాడడం వంటివి చేస్తూ కుటుంబ సభ్యులకు చికాకు తెప్పిస్తున్నారు. ఎవరైనా సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తే సైకోలుగా మారి విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh)లో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. భర్త మొబైల్ లాక్కున్నాడనే కోపం భార్య దారుణంగా ప్రవర్తించింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు (Viral News).


ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన ప్రదీప్ సింగ్ అనే వ్యక్తి 2007లో బేబీ యాదవ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి 14 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అయితే ఇటీవల బేబి తరచుగా మొబైల్‌తోనే ఎక్కువ సమయం గడుపుతోంది. స్నేహితులతో గంటలు గంటలు మాట్లాడుతోంది. ప్రదీప్ ఎన్నిసార్లు నచ్చచెప్పినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రదీప్ తన భార్య దగ్గర ఉండే మొబైల్‌ను తీసి దాచేశాడు. ఆమెకు దొరక్కుండా చేశాడు (Crime News).


మొబైల్ అందుబాటులో లేకపోవడంతో బేబీ యాదవ్ పిచ్చి పట్టినట్టు ప్రవర్తించింది. భర్తను స్పృ‌హ తప్పలా చేసి అతడిని మంచానికి కట్టేసి క్రికెట్ బ్యాట్‌తో దారుణంగా కొట్టింది. అనంతరం అతడికి రెండు సార్లు కరెంట్ షాక్‌లు ఇచ్చింది. తండ్రిని కాపడడానికి వచ్చిన 14 ఏళ్ల కొడుకును కూడా తీవ్రంగా కొట్టింది. ఆమె బారి నుంచి తప్పించుకున్న ప్రదీప్ వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తనకు, తన కొడుకుకు ప్రాణ హాని ఉందని తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి..

Viral: బ్రిటీష్ కాలం నాటి రూ.10 నోటు చూశారా? దానిని ఇప్పుడు దక్కించుకోవడానికి ఎంత ఖర్చు పెట్టాలంటే..


Opitcal Illusion: మీ కళ్లు ఎంతో షార్ప్ అయితే తప్ప.. ఈ ఫొటోలోని ``W`` ని కనిపెట్టలేరు.. ఓ సారి ప్రయత్నించండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 31 , 2024 | 11:30 AM

Advertising
Advertising