ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

T20 World Cup2024: ఐర్లాండ్‌పై గెలిచి పాకిస్థాన్ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా

ABN, Publish Date - Jun 06 , 2024 | 09:44 AM

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup2024) భాగంగా న్యూయార్క్‌ వేదికగా బుధవారం రాత్రి ఐర్లాండ్‌పై సునాయాస విజయం సాధించిన భారత్... T20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. రికార్డు స్థాయి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టీ20 వరల్డ్ కప్‌ టోర్నమెంట్‌లో అత్యధిక విజయాలు సాధించిన రెండవ జట్టుగా భారత్ నిలిచింది.

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup2024) భాగంగా న్యూయార్క్‌ వేదికగా బుధవారం రాత్రి ఐర్లాండ్‌పై సునాయాస విజయం సాధించిన భారత్... T20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. రికార్డు స్థాయి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టీ20 వరల్డ్ కప్‌ టోర్నమెంట్‌లో అత్యధిక విజయాలు సాధించిన రెండవ జట్టుగా భారత్ నిలిచింది. ఐర్లాండ్‌పై విజయంతో టీ20 వరల్డ్ కప్‌లో భారత్ మొత్తం 29 విజయాలు సాధించింది. పాకిస్థాన్‌పై సూపర్ ఓవర్ విజయంతో కలుపుకొని 29 విజయాలు నమోదు చేయగా 28 విజయాలతో పాకిస్థాన్ రెండో స్థానానికి పడిపోయింది. కాగా మొత్తం 32 విజయాలతో శ్రీలంక అగ్రస్థానంలో ఉండడం గమనార్హం.


టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక విజయాలు (సూపర్ ఓవర్ విజయాలతో కలుపుకొని)

1. శ్రీలంక- 32 విజయాలు (52 మ్యాచ్‌ల్లో)

2. భారత్- 29 విజయాలు (46 మ్యాచ్‌ల్లో)

3. పాకిస్థాన్- 28 విజయాలు (47 మ్యాచ్‌ల్లో)

4. ఆస్ట్రేలియా- 25 విజయాలు (40 మ్యాచ్‌ల్లో)

5. దక్షిణాఫ్రికా- 25 విజయాలు (41 మ్యాచ్‌ల్లో ).


ఐర్లాండ్‌పై సునాయాస విజయం..

కాగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్ -ఏ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని భారత్ కేవలం 12.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (52 రిటైర్డ్ హర్ట్), రిషబ్ పంత్ (36 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (2), శివమ్ దూబే (2 నాటౌట్) చొప్పున పరుగులు చేసి భారత్‌ను ఈజీగా గెలిపించారు. బౌలింగ్ విషయానికి వస్తే.. హార్ధిక్ పాండ్యా 3 వికెట్లు, అర్షదీప్ సింగ్, బుమ్రా చెరో 2 వికెట్లు, సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టగా మరో వికెట్ రనౌట్ రూపంలో దక్కింది.

కాగా ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. కాగా జూన్ 9న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అసలుసిసలైన మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి

Rohit Sharma: రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి ఆటగాడిగా అవతరణ

T20 World Cup India vs Ireland : బోణీ అదిరింది..!

భారత ఫ్యాన్స్‌కు అనుకూలంగా వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ సమయాలు

For mor Sports News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 09:44 AM

Advertising
Advertising