ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hardik Pandya: హార్దిక్ పాండ్యాతో విడాకులు.. ఆ పనితో క్లారిటీ ఇచ్చేసిన నటాషా!

ABN, Publish Date - Jul 17 , 2024 | 04:51 PM

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టోంకోవిచ్ విడాకులు తీసుకోనున్నారని గత కొన్ని రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం అందరికీ తెలిసిందే.

Hardik Pandya - Natasa Stankovic

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), అతని భార్య నటాషా స్టోంకోవిచ్ (Natasa Stankovic) విడాకులు తీసుకోనున్నారని గత కొన్ని రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా.. తన సోషల్ మీడియా ఖాతాల నుంచి పాండ్యా ఇంటి పేరుని నటాషా తొలగించినప్పటి నుంచి ఈ రూమర్లు ఊపందుకున్నాయి. ఈ వ్యవహారంపై వాళ్లిద్దరూ ఇంతవరకూ స్పందించలేదు కానీ, వారి మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం విడాకుల వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో నటాషా చేసిన ఓ పని.. ఆ రూమర్లకి మరింత ఆజ్యం పోసింది. తన కుమారుడు అగస్త్యను తీసుకొని.. ఆమె ముంబయి నుంచి సెర్బియాకు వెళ్లిపోయింది.


Read Also: శ్రీలంక మాజీ కెప్టెన్ దారుణ హత్య.. భార్య, పిల్లల ముందే..

బుధవారం తెల్లవారుజామున ముంబైయి విమానాశ్రయం వద్ద నటాషా తన కుమారుడితో కలిసి కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటు.. నటాషా సైతం తన ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఎయిర్‌పోర్టుకు బయలుదేరడానికి ముందు తన లగేజీని ప్యాక్ చేసుకుంటున్న ఫోటోతో పాటు కారులో తన పెంపుడు కుక్కతో కూడిన ఫోటోలను పంచుకుంది. ‘‘ఈ ఏడాదిలో ఆ సమయం వచ్చేసింది’’ అంటూ ఆ ఫోటోలను క్యాప్షన్ పెట్టింది. దానికి కన్నీళ్లతో కూడిన ఎమీజీ, విమానం, ఇల్లు, హార్ట్ సింబల్‌ వంటి ఇతర ఎమోజీలను జత చేసింది. దీన్ని బట్టి.. హార్దిక్, నటాషా విడిపోతున్నారన్న వాదనలు నిజమేనని దాదాపు క్లారిటీ వచ్చేసినట్లే.


ఇదిలావుండగా.. 2020లో నటాషాను హార్దిక్ పాండ్యా ప్రపోజ్ చేయగా, దాన్ని ఆమె అంగీకరించింది. అనంతరం వీళ్లిద్దరు లాక్‌డౌన్‌లో పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ వెంటనే వీళ్లకు ఓ కుమారుడు కూడా జన్మించాడు. వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది కానీ.. ఇంతలో ఎవరి దిష్టి తగిలిందో ఏమో, ఇలా ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు దూరంగా ఉంటున్నారు. ఇటు నటాషా తన కుమారుడితో కలిసి సెర్బియాకు వెళ్లిపోగా.. అటు హార్దిక్ శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. టీ20 సిరీస్‌కు గాను భారత జట్టుకి నాయకత్వం వహించనున్నాడు కానీ, వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. బహుశా భార్యతో విడాకుల కోసమే అతను ఈ బ్రేక్ తీసుకొని ఉండొచ్చు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 17 , 2024 | 04:51 PM

Advertising
Advertising
<