ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Watch Video: మలింగలా బౌలింగ్ చేస్తున్నావు.. షకిబ్‌ బంతులపై కోహ్లీ కామెంట్.. వీడియో వైరల్..

ABN, Publish Date - Sep 21 , 2024 | 10:50 AM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఉన్నంత సేపు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. బ్యాటింగ్ చేస్తున్నా, ఫీల్డింగ్ చేస్తున్నా తనదైన ఉత్సాహంతో కనిపిస్తుంటాడు. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతో కూడా సరదాగా మాట్లాడుతుంటాడు. ప్రస్తుతం చెన్నైలో బంగ్లాదేశ్, భారత్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది

Virat Kohli

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మైదానంలో ఉన్నంత సేపు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. బ్యాటింగ్ చేస్తున్నా, ఫీల్డింగ్ చేస్తున్నా తనదైన ఉత్సాహంతో కనిపిస్తుంటాడు. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతో కూడా సరదాగా మాట్లాడుతుంటాడు. ప్రస్తుతం చెన్నైలో బంగ్లాదేశ్, భారత్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది (Ind vs Ban Test Match). ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్‌తో (Shakib Al Hasan) కోహ్లీ సరదాగా మాటలు కలిపాడు. కోహ్లీ మాటలు స్టంప్ మైక్రోఫోన్‌లో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


టీమిండియా వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోవడంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో బౌలింగ్‌కు వచ్చిన షకిబ్.. కోహ్లీకి వరుసగా యార్కర్లు సంధించాడు. ఓవర్ అనంతరం నాన్-స్ట్రైకర్ ఎండ్‌కు వచ్చిన కోహ్లీ.. షకిబ్‌‌తో మాటలు కలిపాడు. షకిబ్ వైపు చూస్తూ.. ``మలింగలా బౌలింగ్ చేస్తున్నావు`` అన్నాడు. కోహ్లీ మాటలను షకిబ్ పాజిటివ్‌గా తీసుకున్నాడు. నవ్వుతూ ఫీల్డింగ్‌కు వెళ్లిపోయాడు. కోహ్లీ సంభాషణ స్టంప్ మైక్రోఫోన్‌లో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది.


తొలి రోజు బ్యాటింగ్ చేసిన భారత్ 376 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 149 పరుగులకే పెవిలియన్ చేరింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ప్రస్తుతం నిలకడగా ఆడుతోంది. ఉదయం 10:45 గంటలకు మూడు వికెట్లు కోల్పోయి 139 పరుగులతో ఆడుతోంది. శుభ్‌మన్ గిల్ (60 నాటౌట్), పంత్ (45 నాటౌట్) క్రీజులో ఉన్నారు. జైస్వాల్ (10), రోహిత్ శర్మ (5), కోహ్లీ (17) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. ప్రస్తుతం టీమిండియా 368 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇవి కూడా చదవండి..

Test Match : బంగ్లా ఢమాల్‌


Ind vs Ban: బంగ్లాదేశ్ మరో తప్పిదం.. ఐసీసీ నుంచి జరిమానా తప్పదా..?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 21 , 2024 | 10:50 AM