ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Peddapalli :ఆరేళ్ల బాలికపై హత్యాచారం

ABN, Publish Date - Jun 15 , 2024 | 04:21 AM

రాత్రి మిల్లులో నిద్రిస్తుండగా కరెంట్‌ పోవడంతో ఉక్కబోత భరించలేక తమ ఇద్దరు బిడ్డలను తీసుకొని ఆరుబయటకొచ్చి నిద్రకు ఉపక్రమించడమే ఆ దంపతుల తప్పయింది! తల్లి చుట్టూ చేతులేసి హాయిగా నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఓ దుండగుడు ఎత్తుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌-కాట్నపల్లి మధ్య రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న ఓ రైస్‌ మిల్లు వద్ద ఈ ఘోరం జరిగింది.

  • పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ సమీపంలో ఘోరం

  • వారం క్రితమే రైస్‌మిల్లులో పనికి కుదిరిన దంపతులు

  • రాత్రి బాలిక నిద్రిస్తుండగా అపహరించిన దుండగుడు

  • పక్కనే మరో రైస్‌ మిల్లులోకి తీసుకెళ్లి అత్యాచారం, హత్య

  • సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌.. కఠిన చర్యలకు ఆదేశం

  • పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ సమీపంలో ఘోరం

సుల్తానాబాద్‌, మణుగూరు టౌన్‌, జూన్‌ 14: రాత్రి మిల్లులో నిద్రిస్తుండగా కరెంట్‌ పోవడంతో ఉక్కబోత భరించలేక తమ ఇద్దరు బిడ్డలను తీసుకొని ఆరుబయటకొచ్చి నిద్రకు ఉపక్రమించడమే ఆ దంపతుల తప్పయింది! తల్లి చుట్టూ చేతులేసి హాయిగా నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఓ దుండగుడు ఎత్తుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌-కాట్నపల్లి మధ్య రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న ఓ రైస్‌ మిల్లు వద్ద ఈ ఘోరం జరిగింది. ఈ మిల్లులో పని చేయడానికి ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన దంపతులు వారం క్రితమే చేరారు. ఈ దంపతులకు ఆరేళ్లు, ఏడాది వయసున్న ఇద్దరు కూతుళ్లున్నారు. గురువారం రాత్రి ఆ దంపతులు మిల్లులోని లేబర్‌ రూముల్లో నిద్రపోయారు. కరెంటు పోవడంతో ఉక్కపోత భరించలేక రాత్రి పదిన్నరకు తమ ఇద్దరు చిన్నారులతో కలిసి గది ముందు భాగంలోని రేకుల షెడ్డు కిందకొచ్చి పడుకున్నారు.

కొద్దిసేపటికి తల్లి లేచి చూసేసరికి పెద్ద కూతురు కనిపించలేదు. భర్తను నిద్రలేపి విషయం చెప్పింది. అతడు, మిల్లులోని తోటి కార్మికులందరికి పాప కనబడడం లేదని చెప్పడంతో చుట్టు పక్కల వెతికారు. డయల్‌ 100కు కాల్‌ చేసి సమాచారమిచ్చారు. వారొచ్చి మిల్లు పరిసరాల్లో పాప ఆచూకీ దొరక్కపోవడంతో సీసీ ఫుటేజీని పరిశీలించగా ఒక వ్యక్తి పాపను భుజాన వేసుకుని వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. పాప అపహరణకు గురైన మిల్లును అనుకుని మరో మిల్లు ఉంది. అక్కడికి పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున వెళ్లగా ఓ కార్మికుడు బట్టలు ఉతుకుతూ కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అతడే దుర్మార్గానికి ఒడిగట్టినట్లు తేలింది.


పాపను మిల్లు వెనుక వైపు పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, హత్య చేసినట్లు అతడు ఒప్పుకొన్నాడు. అనంతరం పొదల్లో వెతగ్గా చిన్నారి మృతదేహం కనిపించింది. నిందితుడు మధ్యప్రదేశ్‌ వాస్తవ్యుడని, ఆ మిల్లులో డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు తోటి కార్మికులు తెలిపారు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా కొత్తగూడెం జిల్లా మణుగూరులో తొమ్మిదేళ్ల బాలికపై ఓ దుండగుడు లైంగికదాడికి యత్నించాడు. భద్రాచలం డివిజన్‌లోని తోటపల్లికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఉద్యోగ రీత్యా పినపాక మండలం జానంపేటలో విధులు నిర్వహిస్తున్నాడు.

గురువారం సాయంత్రం 7:30 గంటలకు పూటుగా మద్యం తాగిన ఆ వ్యక్తి, ఇంటికి తిరిగొస్తున్న క్రమంలో ఓ చోట బయట మెట్లపై కూర్చున్న తొమ్మిదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి మెట్లమీదుగా ఆమెను డాబాపైకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై లైంగికదాడికి ప్రయత్నించగా ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లారు. అప్పటికే నిందితుడు పారిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - Jun 15 , 2024 | 08:25 AM

Advertising
Advertising