ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పైనుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

ABN, Publish Date - Aug 06 , 2024 | 08:09 AM

అత్తాపూర్‌లోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేపై గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఈసారి మాత్రం ఓ వ్యక్తి ఆ ఫ్లై ఓవర్ పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

రంగారెడ్డి: అత్తాపూర్‌లోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేపై గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఈసారి మాత్రం ఓ వ్యక్తి ఆ ఫ్లై ఓవర్ పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. అతడిని పై నుంచి దూకవద్దని తొలుత అక్కడే ఉన్న కొందరు వారించారు. అప్పటికి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న సదరు వ్యక్తి ఆ తరువాత కొద్ది సేపటికే ఫ్లై ఓవర్ పై నుంచి దూకేశాడు. ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం తెలియరాలేదు. మతి స్థిమితం లేదని మాత్రం తెలుస్తోంది.


అత్తాపూర్‌లోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేపై నుంచి ఓ వ్యక్తి కిందికి దూకేశాడు. దీంతో అతని పరిస్థితి విషమంగా మారింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి అత్తాపూర్‌లోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పైకి వచ్చాడు. అక్కడి పిల్లర్ నెంబర్ 147 నుంచి కిందికి దూకే యత్నం చేశాడు. దీంతో అతడిని స్థానికులు వారించారు. సర్ది చెప్పినా అతడు వినకుండా కొద్దిసేపట్లోనే కిందికి దూకాడు. తీవ్రంగా గాయపడిన అతడిని అత్తాపూర్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి సంబంధించిన వివరాలు తెలియ రాలేదు. అతడికి మతిస్థిమితం లేకపోవచ్చు అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


వనస్థలిపురం వృద్ధురాలి మర్డర్ అప్డేట్...

వనస్థలిపురంలో బాలమ్మ (65) అనే వృద్ధురాలిని అత్యంత దారుణంగా హతమార్చారు. వృద్ధురాలి తలపై ఇటుకలతో మోది హత్య చేరారు. సోమవారం ఉదయం 4:39 నిమిషాలకు గుర్తుతెలియని వ్యక్తి వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. సుమారు 7 నిమిషాల తర్వాత బయటకు వచ్చి బైక్ పై వేరే వ్యక్తి వెళ్తుండడంతో నడుచుకుంటూ నిందితుడు పక్కకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ వృద్ధురాలు ఇంట్లోకి వెళ్లే సమయంలో పక్కనే ఒక రాయి తీసుకొని ఆమె గుడిసె లోపలికి వెళ్లాడు. ఆమె తలపై రాయితో మోది అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం వృద్ధురాలు తలపలిగి తీవ్ర రక్తంతో ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఇటుక రాయితో హతమార్చినట్టుగా గుర్తించారు. నిందితుడు ఇటుక రాయితో ఆమె గుడిసెలోకి వెళ్లి రావడం.. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు నమోదయ్యాయి. వృద్దురాలి ఇంట్లో నిందితుడు సుమారుగా 15 నిమిషాల పాటు గడిపాడు. పోలీసుల విచారణ కొనసాగుతోంది.

Updated Date - Aug 06 , 2024 | 08:09 AM

Advertising
Advertising
<