ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TS News: తమను వెదకొద్దంటూ లెటర్ రాసి పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కాతమ్ముళ్లు..

ABN, Publish Date - Jul 24 , 2024 | 08:12 AM

తమ కోసం వెతకవద్దని చెప్పి తమ్ముడిని తీసుకొని ఇంట్లో నుంచి ఓ యువతి వెళ్లిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

హైదరాబాద్: తమ కోసం వెతకవద్దని చెప్పి తమ్ముడిని తీసుకొని ఇంట్లో నుంచి ఓ యువతి వెళ్లిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా కాలా మండలానికి చెందిన నరేష్ గత కొంతకాలంగా గచ్చిబౌలిలోని మజీద్ బండ ప్రభుపాద లేఅవుట్‌లో నివాసం ఉంటున్నాడు.


నరేష్ అక్క భర్త చనిపోవడంతో కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. దీంతో వారి కుమార్తె హారిక(20), కుమారుడు ఫణీంద్ర(19)లను నరేషే వారిని చిన్ననాటినుంచి తన వద్దే ఉంచుకుని చదువులు చెప్పిస్తున్నాడు. మేనకోడలు కావడంతో హారికను 2022 మే 10వ తేదిన నరేష్ పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం హారిక బీటెక్, ఫణీంద్ర ఇంటర్ చదువుతున్నారు. ఏమైందో ఏమో కానీ హారిక తన తమ్ముడిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది.


హారిక ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 20వ తేదీన కాలేజీకి వెళ్తున్నామని చెప్పి తమ్ముడు ఫణీంద్రతో కలిసి ఇంట్లో నుండి వెళ్లిపోయింది. తమ కోసం వెతకవద్దంటూ లెటర్ రాసి పెట్టింది. అప్పటి నుండి ఇద్దరి కోసం కుటుంబసభ్యులు వెతుకుతూనే ఉన్నారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో మంగళవారం నరేష్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

VC Sajjanar: ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు వైద్య పరీక్షలు

Read more Telangana News and Telugu News

Updated Date - Jul 24 , 2024 | 08:12 AM

Advertising
Advertising
<