ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఖాళీ చేసిన ఇళ్ల కూల్చివేత

ABN, Publish Date - Oct 02 , 2024 | 06:33 AM

మూసీ సుందరీకరణలో మరో అడుగుపడింది. డ్రోన్‌ సర్వే ద్వారా గుర్తించిన నదీ గర్భం (రివర్‌ బెడ్‌)లో ఉన్న ఇళ్ల కూల్చివేత మొదలైంది. స్వచ్ఛందంగా తరలివెళ్లినవారి నివాసాలను తొలగిస్తున్నారు.

Hyderabad

మూసీలో స్వచ్ఛందంగా వెళ్లినవారి నిర్మాణాల

తొలగింపు..

గల్లీల్లో కూలీలతోనే పనులు

డబుల్‌ బెడ్‌ రూమ్‌లకు వెళ్లిన నిర్వాసితులు

కొంత సానుకూలత.. మరికొంత వ్యతిరేకత

సంతోషం వ్యక్తం చేస్తున్న చిన్న కుటుంబాలు'


హైదరాబాద్‌ సిటీ/ఓల్డ్‌ మలక్‌పేట్‌/చాదర్‌ఘాట్‌, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): మూసీ సుందరీకరణలో మరో అడుగుపడింది. డ్రోన్‌ సర్వే ద్వారా గుర్తించిన నదీ గర్భం (రివర్‌ బెడ్‌)లో ఉన్న ఇళ్ల కూల్చివేత మొదలైంది. స్వచ్ఛందంగా తరలివెళ్లినవారి నివాసాలను తొలగిస్తున్నారు. వీరికి డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల తాళాలు అప్పగించాకనే.. మూసీలో ఖాళీ చేసిన ఇళ్లను పడగొడుతున్నారు. ప్రజలు నివసిస్తున్న వాటి జోలికి వెళ్లడం లేదు. మంగళవారం రెవెన్యూ అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో హైదరాబాద్‌లోని నాంపల్లి, సైదాబాద్‌, హిమాయత్‌నగర్‌ మండలాల పరిధి శంకర్‌నగర్‌, వినాయక వీధిలో ఇళ్ల కూల్చివేత చేపట్టారు. ఈ ప్రాంతాల్లో 333 నిర్మాణాలుండగా 300 ఇళ్లకు రివర్‌ బెడ్‌ మార్కింగ్‌ పెట్టారు. 83 ఇళ్లను పడగొట్టినట్లు అధికారులు తెలిపారు. వీటిలో ఎక్కువగా రేకుల షెడ్లు ఉన్నాయి. ఇరుకు గల్లీల్లో ఉండడంతో పొక్లెయిన్లు లేకుండా కూలీలను ఏర్పాటు చేసి నెమ్మదిగా పడగొడుతున్నారు. ఇంటి సామగ్రిని తీసుకెళ్లేందుకు నిర్వాసితులకు అవకాశం కల్పించారు.


ప్రత్యేక వాహనాలు

వస్తువుల తరలింపునకు ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉంచారు. నిర్వాసితులను మలక్‌పేట్‌లోని పిల్లి గుడిసెలు, ఉప్పల్‌లోని ప్రతాాప సింగారంలో ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సముదాయానికి తరలిస్తున్నారు. కాగా, శంకర్‌నగర్‌లో కొందరు నిరసన వ్యక్తం చేశారు. చిన్న డబుల్‌ బెడ్‌ రూంలలో పెద్ద కుటుంబాలు ఎలా ఉంటాయని వాపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా పోలీసులు సముదాయించారు. మూసీతో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చాలామంది ఖాళీ చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలున్న కుటుంబాలు సంతోషంగా వెళ్తుండగా, 6 నుంచి 10 మంది ఉన్నవారు భావోద్వేగానికి గురవుతున్నారు. శనివారం నుంచి 148 మంది వెళ్లినట్లు హైదరాబాద్‌ ఆర్డీవో మహిపాల్‌ తెలిపారు. నాంపల్లి నుంచి జియాగూడలోని డబుల్‌ బెడ్‌రూంలకు 24 మందిని తరలించినట్లు చెప్పారు.


అందరికీ ఒకే విధంగానా?

మూసీ సుందీకరణ ప్రాజెక్టులో.. హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో డ్రోన్‌ సర్వే ద్వారా 2,166 నిర్మాణాలను గుర్తించారు. 1,478 ఇళ్లకు రివర్‌ బెడ్‌ మార్కింగ్‌ వేశారు. హైదరాబాద్‌ జిల్లాలో 1,595 నిర్మాణాలకు గాను 1,333కు మార్కింగ్‌ పెట్టారు. అధికారులు కౌన్సెలింగ్‌ ఇస్తూ డబుల్‌ బెడ్‌రూమ్‌లకు తరలించే చర్యలు తీసుకుంటున్నారు. నిర్వాసితుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మూసీ ఇబ్బందులు తీరినట్లేనని భావిస్తుండగా.. మరికొందరు తమకు తీరని అన్యాయం చేస్తున్నారని విలపిస్తున్నారు. 30, 40 గజాల్లో ఉంటున్నవారికి, 100-150 గజాల్లో రూ.లక్షలతో ఇల్లు కట్టుకున్నవారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు వెళ్లినవారిలో కొందరు సౌకర్యాలు లేవని ఆరోపిస్తున్నారు. అప్పటికే ఆ ఇళ్లలో ఉన్నవారు సహకరించడం లేదని.. ఈ సమస్య నివారణకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. మూసీ నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Oct 02 , 2024 | 09:06 AM