ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TS News: శంషాబాద్‌లో దారుణం... నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

ABN, Publish Date - Jul 23 , 2024 | 08:33 AM

ఆడపిల్ల అయితే చాలు.. అది పసికందా? లేదంటే నాలుగేళ్ల చిన్నారా? అనే విషయాన్ని కొందరు మృగాళ్లు పట్టించుకోవడం లేదు. ఇటీవలే ఏపీలో నెలల పసికందుపై అత్యాచారం ఘటన మరువక ముందే..

రంగారెడ్డి: ఆడపిల్ల అయితే చాలు.. అది పసికందా? లేదంటే నాలుగేళ్ల చిన్నారా? అనే విషయాన్ని కొందరు మృగాళ్లు పట్టించుకోవడం లేదు. ఇటీవలే ఏపీలో నెలల పసికందుపై అత్యాచారం ఘటన మరువక ముందే తెలంగాణలో నాలుగేళ్ల పసిదానిపై ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. సిద్ధాంతిలో నాలుగేళ్ల పాప, భార్యతో కలిసి ఓ ఉద్యోగి నివాసముంటున్నాడు.


అదే ఇంటికి దేవరకద్రకు చెందిన కామాంధుడు రామంజనేయులు కాపలా దారుడిగా పనిచేస్తున్నాడు. సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలికను గమనించి ఇంట్లోకి తీసుకెళ్లి రామాంజనేయులు అత్యాచారం చేశాడు. అత్యాచారం అనంతరం బాలిక స్పృహ కోల్పోవడంతో చాపలో చుట్టి మంచం కింద నిందితుడు దాచి ఉంచాడు. ఇంటికి వచ్చాక పాప కనిపించడంతో చిన్నారి తల్లి ఆందోళనతో వెదకడం ఆరంభించింది.


తన గదిలో ఒక్కడే ఉన్న రామాంజనేయులును పాప గురించి ప్రశ్నించింది. అయితే రామాంజనేయులు పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చి ఇంట్లో వెదకగా మంచం కింద చిన్నారి కనిపించింది. తన పాపను అలా చూడగానే ఆ తల్లికి గుండె ఆగినంత పనైంది. వెంటనే స్థానికులను పిలిచింది. కామాంధుడు రామాంజనేయులుకు దేహశుద్ధి చేసి పోలీసులకు స్థానికులు అప్పగించారు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పోలవరానికి 12,157 కోట్లివ్వండి

ఐదేళ్లుగా అశాంతి!

Read Latest Telangana News and National News

Updated Date - Jul 23 , 2024 | 08:33 AM

Advertising
Advertising
<