ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేశాడు...

ABN, Publish Date - May 23 , 2024 | 12:52 PM

ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేశాడని భార్య భర్త ఇంటి ఎదుట ఆందోళన చేసింది. ఈ సంఘటన యాదాద్రిభువనగిరి(Yadadribhuvanagiri) జిల్లా రాజాపేట మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్థులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..

- భర్త ఇంటి ఎదుట భార్య నిరసన

హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేశాడని భార్య భర్త ఇంటి ఎదుట ఆందోళన చేసింది. ఈ సంఘటన యాదాద్రిభువనగిరి(Yadadribhuvanagiri) జిల్లా రాజాపేట మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్థులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన రేకులపల్లి మహిపాల్‌రెడ్డి హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని రామాంతపూర్‌కు చెందిన యువతితో 2021లో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2021 జూన్‌ 6వ తేదీన సింహాచలం దేవస్థానంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం హైదరాబాద్‌(Hyderabad)లోని నాగోల్‌లో ఉంటూ కుటుంబ సభ్యుల సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. యువతి నుంచి 24 తులాల బంగారం, రూ.70లక్షల నగదుతోపాటు మోత్కూరులో ఉన్న ప్లాట్లు తీసుకొని తనకున్న అప్పులు తీర్చుకున్నాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఎస్‌ఐపై ఎస్సీఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు..


15 రోజుల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. తనను మోసం చేశాడని హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‏స్టేషన్‌లో కేసు పెట్టింది. కొంతకాలంగా మహిపాల్‌రెడ్డి మొహం చాటేస్తుండడంతో తనకు న్యాయంచేయాలని మహిపాల్‌రెడ్డి స్వగ్రామమైన బూరుగుపల్లిలోని మహిపాల్‌రెడ్డి ఇంటిముందు వంటా వార్పుతో కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం నిరసన దీక్ష చేపట్టింది. మహిపాల్‌రెడ్డి తల్లి పద్మ రెండు రోజుల క్రితం ఇంటికి తాళంవేసి తన బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్థులు, కొంతమంది నాయకులు యువతీ దీక్షకు సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దీక్ష విరమింపజేసేందుకు యత్నించారు. గురువారం మహిపాల్‌రెడ్డిని రప్పించి న్యాయం చేస్తామని ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి హామీ ఇవ్వడంతో యువతి కుటుంబ సభ్యులు దీక్షను విరమించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 23 , 2024 | 12:52 PM

Advertising
Advertising