ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gold Scheme: గోల్డ్ స్కీం పేరుతో బురిడీ కొట్టించిన ముఠా..

ABN, Publish Date - May 24 , 2024 | 11:33 AM

హైదరాబాద్: గోల్డ్ స్కీం పేరుతో ఓ ముఠా పలువురిని బురిడీ కొట్టించింది. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని నమ్మిస్తూ పలువురి వద్ద నుంచి కేటుగాళ్లు సుమారు రూ.4 కోట్లు వసూలు చేసి పరారయ్యారు. తమ స్కీం లో 50 వేల రూపాయలు కట్టి చేరితే.. బంగారం మార్కెట్ రేట్ కంటే 10 శాతం తక్కువకు ఇస్తామని కేటుగాళ్లు నమ్మించారు.

హైదరాబాద్: గోల్డ్ స్కీం (Gold Scheme) పేరుతో ఓ ముఠా పలువురిని బురిడీ కొట్టించింది. తక్కువ ధరకు బంగారం (Gold) ఇప్పిస్తామని నమ్మిస్తూ పలువురి వద్ద నుంచి కేటుగాళ్లు సుమారు రూ.4 కోట్లు (4 crores) వసూలు చేసి పరారయ్యారు. తమ స్కీం లో 50 వేల రూపాయలు కట్టి చేరితే.. బంగారం మార్కెట్ రేట్ కంటే 10 శాతం తక్కువకు ఇస్తామని కేటుగాళ్లు నమ్మించారు. దగ్గరి బంధువులు, స్నేహితులు, అమాయకుల నుంచి డబ్బులు కాజేసారు. కాజేసిన డబ్బులతో కేటుగాళ్లు విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత ముఠా చేతిలో మోసపోయామని తెలుసుకున్న బాధితులు కేటుగాళ్లు.. విశాల్ (Vishal), వినయ్ (Vinay), నిఖిల్‌ (Nikhil)పై సీసీఎస్‌ (CCS)లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


మొదట ఈ కేటుగాళ్లు దగ్గరి బంధువుల నుంచి డబ్బులు సేకరించారు. ఆ తరువాత దీనిని చైన్‌ సిస్టమ్‌లా మార్చేశారు. మొదటి గోల్డ్‌స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వాళ్లకు కొంత లాభం వచ్చిందంటూ నమ్మించి.. కొంతమందికి డబ్బులు తిరిగి ఇచ్చారు. దీంతో చాలా మంది కేటుగాళ్ల మాటలు నమ్మి స్కీమ్‌లో చేరారు. అయితే వసూలు చేసిన డబ్బులతో విలాసవంతమైన జీవితం గడుపుతూ తామంతా బంగారం వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తున్నామంటూ బిల్డప్‌ ఇచ్చారు. ఇలా రూ.4 కోట్లు వరకు వసూలు చేసి పరారయ్యారు. ఈ మోసంపై రామంతాపూర్‌కు చెందిన బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగాళాఖాతంలో బలపడుతున్న రెమాల్ తుఫాను

మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి ఫోకస్..!

పోలీసులకు నోటీసులు పంపిస్తా..: శ్రీకాంత్

పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌

ఇద్దరికీ ఇదే లాస్ట్‌ చాన్స్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 24 , 2024 | 11:33 AM

Advertising
Advertising