ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: రామోజీ కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

ABN, Publish Date - Jun 12 , 2024 | 05:08 AM

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబసభ్యులను మంగళవారం సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. రామోజీరావు మరణించిన సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం సీడబ్ల్యూసీ, పార్టీ ఇతర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండడంతో పార్థివ దేహాన్ని చూసేందుకుగానీ, అంత్యక్రియలకు గానీ హాజరు కాలేకపోయారు.

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబసభ్యులను మంగళవారం సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. రామోజీరావు మరణించిన సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం సీడబ్ల్యూసీ, పార్టీ ఇతర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండడంతో పార్థివ దేహాన్ని చూసేందుకుగానీ, అంత్యక్రియలకు గానీ హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం రామోజీ ఫిల్మ్‌ సిటీలోని రామోజీరావు నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్‌ ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. రామోజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. సీఎంతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, ఇటీవల ఖమ్మం పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన తీన్మార్‌ మల్లన్న మంగళవారం సీఎం రేవంత్‌ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వారిని అభినందించి శాలువాలతో సత్కరించారు.

Updated Date - Jun 12 , 2024 | 05:08 AM

Advertising
Advertising