ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: దమ్ముంటే షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జగన్‌కు సవాల్

ABN, Publish Date - Jul 13 , 2024 | 01:53 PM

2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ షర్మిలపై వైసీపీ నేతలు చేసిన విమర్శలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు.

విజయవాడ: 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ షర్మిలపై వైసీపీ నేతలు చేసిన విమర్శలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మాట్లాడుతూ.. దమ్ముంటే.. షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జగన్‌కు, ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని డిగ్రీ కౌన్సిలింగ్‌‌ను వెంటనే నిర్వహించాలన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. పిల్లందరికీ అమ్మఒడి ఇస్తామని నాడు జగన్ చెప్పి మాట తప్పారని మస్తాన్ వలి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే విధంగా హామీలు ఇచ్చి.. అమలు చేయడం లేదన్నారు.


మా అధ్యక్షురాలు అటు జగన్ పాలన, ఇటు చంద్రబాబు పాలన పైనా విమర్శలు చేశారని మస్తాన్ వలి అన్నారు. జగన్‌పై చేసిన వ్యాఖ్యలను ఓర్చుకోలేని వైసీపీ తన పత్రికలో షర్మిలపై అబద్దాలు రాస్తున్నారన్నారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ ఏం చెప్పారో మేము చూపిస్తామని.. ఈ ఐదేళ్లు వాటిని అమలు చేయకుండా మోసం చేశారని మేము అంటున్నామని మస్తాన్ వలి పేర్కొన్నారు. వీటిని షర్మిల ప్రశ్నిస్తే.. చంద్రబాబుతో ముడి పెట్టి.. వైసీపీ నేతలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. గాలి పోగేసుకుని, గాలి మాటలు మాట్లాడుతూ. షర్మిల వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారన్నారు. వైసీపీ నాయకులకు మాతో చర్చించే దమ్ముందా..? అని మస్తాన్ వలి ప్రశ్నించారు. జగన్ కు పాలన చేతకాలేదని ఒప్పుకోకుండా.. చంద్రబాబుకు షర్మిల బి టీం అని పిచ్చు కూతలు కూస్తున్నారన్నారు.


బీజేపీ అంటే.. బాబు, జగన్, పవన్ అని మేమంతా ఘంటాపథంగా చెబుతున్నామని... ఇది అబద్దం.. అని చెప్పే దమ్ము, ధైర్యం జగన్ కు ఉందా? అని మస్తాన్ వలి ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ఏ బిల్లు పెట్టినా వెంటనే వెళ్లి మద్దతు ఇచ్చిన వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు. తన కేసుల కోసం మోదీ కాళ్ళపై పడి .. తప్పుకోవాలనుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ కి బీ టీం వైసీపీ.. అని మేము అంటున్నాం.. కాదని చెప్పే దైర్యం ఉందా? అని నిలదీశారు. తాజాగా లోక్ సభ స్పీకర్ ఎంపిక విషయంలో కూడా మీరు మోదీకి మద్దతు ఇచ్చారని మస్తాన్ వలి విమర్శించారు. షర్మిల అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, దైర్యం మీకు ఉందా? అని నిలదీశారు. ఏపీలో, కేంద్రంలో పాలకుల అక్రమాలను ప్రశ్నించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని మస్తాన్ వలి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

Congress: బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్ గూటికి గాంధీ

NV Ramana: చంద్రబాబు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం శుభపరిణామం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 13 , 2024 | 01:53 PM

Advertising
Advertising
<