ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చంద్రబాబు అనుభవంతో విజయవాడ ప్రజలను కాపాడారు : మల్లారెడ్డి

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:19 AM

‘తుపాన్‌ ప్రభావంతో విజయవాడ అతలాకుతలమైనప్పటికీ వరదలోనే దాదాపు 30 కిలోమీటర్లు తిరిగి ప్రజలను కాపాడిన ఘనత చంద్రబాబుది.

పార్టీ మారడంపై అవసరం వచ్చినప్పుడు చెబుతా: మల్లారెడ్డి

తిరుమల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘తుపాన్‌ ప్రభావంతో విజయవాడ అతలాకుతలమైనప్పటికీ వరదలోనే దాదాపు 30 కిలోమీటర్లు తిరిగి ప్రజలను కాపాడిన ఘనత చంద్రబాబుది. ఆయన అనుభవంతో సహాయ కార్యక్రమాలు భారీగా నిర్వహించి ప్రజలను కాపాడారు. ఆయనకు నా ధన్యవాదాలు’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. శ్రీవేంకటేశ్వరస్వామి తాను ఏది కోరినా తీర్చే దేవుడన్నారు. మెడికల్‌, ఇంజనీరింగ్‌ కాలేజీలు ఇవ్వడంతో పాటు ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే వంటి పదవులు స్వామి ఇచ్చిన ప్రసాదమన్నారు. మంచి యూనివర్సిటీ కూడా ఇచ్చిన నేపథ్యంలో మొక్కు చెల్లించుకునేందుకు కాలినడకన తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించి స్వామిని దర్శించుకున్నట్టు చెప్పారు. పార్టీ మారే అవకాశాలున్నాయా అన్న ప్రశ్నకు పార్టీ మారనంటూనే అవసరమొచ్చినప్పుడు చెబుతానని వెళ్లిపోయారు.

Updated Date - Sep 10 , 2024 | 03:19 AM

Advertising
Advertising