ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: నా అప్లికేషన్లు చెత్తబుత్తలో వేశారా.. మాజీ డీఎస్పీ నళిని ఆవేదన

ABN, Publish Date - Jul 21 , 2024 | 02:39 PM

ప్రభుత్వానికి తాను అందించిన వినతిపత్రాలపై సానుకూల స్పందన రాకపోవడంతో సామాజిక మాద్యమం ఫేస్‌బుక్‌లో ఆమె ఒక పోస్టు పెట్టారు. తనను పీఆర్‌ స్టంట్ కోసం వాడుకొని వదిలేశారని మాజీ పోలీస్ అధికారి నళిని ఆవేదన వ్యక్తం చేశారు.

CM Revanth and Nalini

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సడెన్‌గా ఒక మాజీ పోలీస్ అధికారి పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆ ఉద్యోగిని బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవడంతో పాటు.. ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆమె ఆచూకీ తెలుసుకుని.. సీఎంను కలవాలంటూ మాజీ డీఎస్పీ నళినికి కబురు పంపారు. నేరుగా సీఎం పిలవడంతో ఆమె రేవంత్‌రెడ్డిని కలిశారు. నళినికి పోలీస్ శాఖలో గతంలో ఆమె పనిచేసిన హోదాకు తగ్గకుండా ఉద్యోగం ఇచ్చేందుకు ప్రతిపాదించగా.. నళిని తిరస్కరించారు. ప్రస్తుతం ఆమె అధ్యాత్మిక మార్గంలో ఉన్నానని, ఉద్యోగం చేసుందుకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. పోలీస్ ఉద్యోగానికి అవసరమైన ఫిట్‌నెస్‌తో తాను లేనని చెబుతూ.. ప్రభుత్వం సహాయం చేయాలనుకుంటే వేద విద్య ప్రచారం కోసం సహాయం చేయాలని అడిగారు. దీనికి సంబంధించి రెండు వినతిపత్రాలను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. నళిని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దాదాపు 7 నెలలు అవుతున్నా.. ఆమె చేసిన వినతులపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె మరోసారి ప్రభుత్వానికి లేఖ రాశారు. కొంచెం ఘాటైన పదాలను ఉపయోగిస్తూ ఆమె లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Telangana: ఘనంగా మహంకాళి బోనాల పండుగ.. భారీగా తరలివస్తున్న భక్తులు..


నళిని రాసిన లేఖ ఇదే..

ప్రభుత్వానికి తాను అందించిన వినతిపత్రాలపై సానుకూల స్పందన రాకపోవడంతో సామాజిక మాద్యమం ఫేస్‌బుక్‌లో ఆమె ఒక పోస్టు పెట్టారు. తనను పీఆర్‌ స్టంట్ కోసం వాడుకొని వదిలేశారని మాజీ పోలీస్ అధికారి నళిని ఆవేదన వ్యక్తం చేశారు. యాచకులకు ఇచ్చిన విలువ కూడా తనకు రేవంత్ ప్రభుత్వంలో ఇవ్వడంలేదన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కొలువుకు ఎక్కగానే తనకు ఎక్కువ ప్రచారం కల్పించారని.. ఇప్పుడేమో చప్పుడే చేస్తలేదని నళిని పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరిగిన సందర్భంలోనూ నా వూసే ఎత్తకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇంతకీ తన రెండు దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నయో లేక చెత్త బుట్టలోకి పోయినవో అనే అనుమానం కలుగుతుందన్నారు. సీఆర్వో, ఓఎస్డీకి ఓ లేఖ రాశానంటూ ఆమె ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.

Minister Tummala: పెద్దవాగు ఘటన బాధాకరం...


తీవ్ర ఆవేదన..

చిన్నప్పుడు అడుక్కుంటూ ఎవరైనా ఇంటి ముందుకు వస్తే.. ఇంట్లో చల్లన్నం లేకపోతే పైకి వెల్లవయ్య అని మెల్లగా చెప్పేవాళ్లమని.. కనీసం అలాంటి మర్యాద అయినా తనకు ఇస్తారేమో చూడాలని పేర్కొన్నారు. తాను చాలా ఏళ్లుగా ఎవ్వరినీ కలవలేని.. ఉద్యమం చేసేటప్పుడే తనకు చాలా విషయాలు అర్థం అయ్యాయని చెప్పారు. ఒక నెలలో తన పిటిషన్‌పై విచారణ పూర్తి చేస్తారని భావించానని.. ఏడు నెలలు పూర్తైనా ఎటువంటి స్పందన లేకపోవడంతో.. రిమైండ్ లెటర్ రాయాల్సి వచ్చిందని నళిని తెలిపారు. సచివాలయం చుట్టూ తిరిగేంత సమయం, ఓపిక తన వద్ద లేవనే విషయాన్ని రేవంత్‌ రెడ్డిని కలినప్పుడే చెప్పానని నళిని తెలిపారు.


Weathe Alert: భాగ్యనగరానికి భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్...

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Jul 21 , 2024 | 02:50 PM

Advertising
Advertising
<