ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: హైడ్రా భయంతో అమరావతికి పెట్టుబడులు.. ఇదంతా రేవంత్ ప్లానేనన్న కౌశిక్ రెడ్డి

ABN, Publish Date - Sep 13 , 2024 | 03:39 PM

హైడ్రా పేరుతో హైదరాబాద్‌ పెట్టుబడుదారుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. దీంతో పెట్టుబడులన్నీ అమరావతికి తరలిపోయేలా సీఎం రేవంత్ కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు.

హైదరాబాద్: హైడ్రా పేరుతో హైదరాబాద్‌ పెట్టుబడుదారుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. దీంతో పెట్టుబడులన్నీ అమరావతికి తరలిపోయేలా సీఎం రేవంత్ కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు.

హైడ్రా వెనక ఉన్నది ఏపీ సీఎం చంద్రబాబేనని.. ఆయన ట్రాప్‌లో పడి రేవంత్ రెడ్డి పెట్టుబడులను అమరావతికి తీసుకుపోతున్నారని అన్నారు. ఇక్కడ పెట్టుబడి పెట్టాలన్నా హైడ్రాతో భయపడే పరిస్థితికి తీసుకు వచ్చారని విమర్శించారు. భాగ్యనగర అభివద్ధిని అడ్డుకోవడానికి రేవంత్ చేస్తున్న కుట్ర ఇదని కౌశిక్ అన్నారు.


ప్రతిపక్ష ఎమ్మెల్యేలకేది రక్షణ..

"కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ఇంటి వద్ద సమావేశం అవుదామని అనుకున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్దామని నాతోపాటు శంభిపూర్ రాజు బయలుదేరారు. మమ్మల్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. నాపై నా ఇంటిపై దాడికి పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రే.. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయాలని ఆదేశాలిచ్చారు. నాపై హత్యాయత్నం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయింది. నేను చేసిన తప్పు ఏంటి...? అరికెపూడి గాంధీ భాషను శేరిలింగంపల్లి ప్రజలు గమనించాలి. ఆయన స్వయంగా తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెబుతున్నారు. ఆయన భాషను సమాజం అంగీకరిస్తుందా. నేను వుండే విల్లా సమూదాయంలో మొత్తం 69 కుటుంబాలు నివసిస్తున్నాయి.


అక్కడే ఏపీ మంత్రి నారాయణ తదితర ఎమ్మెల్యేలు ఉంటారు. నా విల్లాపై దాడి చేసి సెక్యూరిటీ గేట్లు పగులగొట్టారు. గాంధీ రౌడీయిజం చూడటానికి మీకు ఓట్లు వేశారా? ఆయన నా ఇంటికి వచ్చి చేసింది ఏం లేదు. గాలికి పగిలిపోయే నా గేట్లు పగలగొట్టి వెళ్లిపోయారు. మా నాయకుడు కేసీఆర్ మాకు సంస్కారం నేర్పించారు. కరీంనగర్ నుండి నేను హైదరాబాద్ వచ్చానని అరికెపూడి గాంధీ అన్నారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని గాంధీ అంటారు. కానీ ఇంటి చుట్టూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఉంటాయి" అని కౌశిక్ విమర్శించారు.

For Latest News and National News click here

Updated Date - Sep 13 , 2024 | 03:39 PM

Advertising
Advertising