ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rangareddy: ఇఫ్తార్ విందులో జేబుదొంగ హల్ చల్..

ABN, Publish Date - Apr 07 , 2024 | 09:15 PM

రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లి లోని ఎస్‌ఎన్సీ కన్వెన్షన్ హాల్ లో రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ విభాగం చైర్మన్ ఫయిమ్ ఖురేషి ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.

రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లి లోని ఎస్‌ఎన్సీ కన్వెన్షన్ హాల్ లో రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ విభాగం చైర్మన్ ఫయిమ్ ఖురేషి ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. మైనారిటీ పెద్దలతో రాజకీయ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇఫ్తార్ విందు జరుగుతున్న సమయంలో ఓ కేటుగాడు దొంగతనానికి దిగాడు.

ఇఫ్తార్ విందులో హడావిడి ఉండగా వీఐపీలతో పాటు స్టేజ్ ఎక్కాడు. వీఐపీల జేబులకే కన్నం వేశాడు. చోరీలో 8 ఫోన్లు, రూ.2 లక్షల నగదు దొంగిలించాడు. అనుమానం వచ్చి కార్యకర్తలు అతన్ని తనిఖీ చేయగా.. దొంగతనం బయటపడింది. దొంగకు దేహ శుద్ధి చేసి అతని నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. ఇఫ్తార్ విందుకు ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, రంజిత్ రెడ్డి, అనిల్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు.

Updated Date - Apr 07 , 2024 | 09:17 PM

Advertising
Advertising