ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TS News: మావోయిస్ట్ అగ్రనేత కన్నుమూత?

ABN, Publish Date - Sep 04 , 2024 | 05:00 PM

మావోయిస్ట్ అగ్రనేత, మొదటి తరం నాయకుడు మాచర్ల ఏసోబ్ అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ మృతి చెందినట్టుగా పోలీస్ వర్గాల సమాచారం. కేంద్ర కమిటీ సభ్యుడు, సెంట్రల్ ఆర్మీ ఇంచార్జ్‌గా, మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఇంఛార్జ్‌గా ఉన్న ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన హనుమకొండ జిల్లా టేకులగూడెం వాసి అని ఛత్తీస్‌గడ్ పోలీస్ అధికారులు చెబుతున్నట్టు సమాచారం.

Naxalites

హైదరాబాద్: మావోయిస్ట్ అగ్రనేత, మొదటి తరం నాయకుడు మాచర్ల ఏసోబ్ అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ మృతి చెందినట్టుగా పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడుగా, సెంట్రల్ ఆర్మీ ఇంచార్జ్‌గా, మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఇంఛార్జ్‌గా ఉన్న ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఏసోబ్ హనుమకొండ జిల్లా టేకులగూడెం వాసి అని ఛత్తీస్‌గడ్ పోలీస్ అధికారులు చెబుతున్నట్టు సమాచారం. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతడు మృతి చెందాడని దంతేవాడ పోలీసులు చెబుతున్నారు. కాగా ఆయన మరణంపై మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. మాచర్ల ఏసోబ్ మరణించారంటూ వస్తున్న వార్తలతో ఆయన స్వగ్రామం టేకులగూడెంలో విషాదం అలుముకుంది.


ఏసోబ్‌పై రూ.25 లక్షల రికార్డు

కాగా మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల ఏసోబ్‌పై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌తో మొత్తం 9 మంది చనిపోయారు. మృతుల పేరు, రివార్డు వివరాలను పోలీసులు ప్రకటించారు.


మృతి చెందిన మావోయిస్టులు వీరే..

1. రణధీర్ (హోదా-డీకేఎస్‌జెడ్‌సీఎం), వరంగల్ నివాసి- రివార్డ్ రూ.25 లక్షలు.

2. కుమారి శాంతి (హోదా -31 పీఎల్ సభ్యుడు) - రివార్డు రూ.5 లక్షలు.

3. సుశీల మడకం, భర్త జగదీష్ (హోదా- ఏసీఎం) - రివార్డ్ రూ.5 లక్షలు.

4. గంగి ముచకి (హోదా- కాటేకల్యాణ్ ఏరియా కమిటీ సభ్యుడు)- రివార్డ్ రూ.5 లక్షలు.

5. కోసా మాద్వి (హోదా- మలంగిర్ ఏరియా కమిటీ పార్టీ సభ్యుడు) - రివార్డ్ రూ.5 లక్షలు.

6. లలిత (హోదా- డీవీసీఎం సురక్షా దళ్ సభ్యుడు) - రివార్డ్ రూ.5 లక్షలు.

7. కవిత (హోదా- గార్డ్ ఆఫ్ ఏవోబీఎస్‌జెడ్‌సీ - రివార్డ్ రూ.5 లక్షలు.

8. హిడ్మే మంకం (హోదా- డీవీసీఎం సురక్షా దళ్ సభ్యుడు - రివార్డ్ రూ.2 లక్షలు.

9. కమలేశ్ (హోదాప్లాటూన్ సభ్యుడు) బీజాపూర్ జిల్లావాసి - రివార్డ్ రూ.2 లక్షలు.


కాగా ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో మంగళవారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారంటూ సమాచారం అందడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోవడంతో పాటు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో 303 సెల్ఫ్ లోడింగ్ రైపిల్స్‌, 12 తుపాకులు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు.

Updated Date - Sep 04 , 2024 | 05:02 PM

Advertising
Advertising