ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Revanth Reddy: అమెరికా పర్యటన ముగించుకొని సౌత్ కొరియాలో అడుగుపెట్టిన రేవంత్

ABN, Publish Date - Aug 12 , 2024 | 08:04 AM

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటన ముగించుకొని సౌత్ కొరియాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడుగుపెట్టారు. పది రోజుల ప్రణాళికలో భాగంగా ఏడు రోజుల పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. రేవంత్‌తో పాటు సౌత్ కొరియాకు మంత్రి శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి సైతం వెళ్లారు. అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసినట్లు రేవంత్ పేర్కొన్నారు. అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశామని రేవంత్ తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన భారీ అమెరికా కంపెనీలు ముందుకొచ్చాయని తెలిపారు.


మొత్తంగా19 అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకారం తెలిపాయన్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని ఆయా కంపెనీలతో చర్చలు, ఏంఓయూలు చేశారు. అమెరికా పర్యటనలో రాష్ట్రానికి 31,532 కోట్ల పెట్టుబడులు, 30, 750 కొత్త ఉద్యోగాలు వచ్చినట్టు రేవంత్ వెల్లడించారు. అమెరికా వేదికగా సీఎం రేవంత్‌ తెలంగాణను ఫ్యూచర్‌ స్టేట్‌గా ప్రకటించడం, హైదరాబాద్‌లో నాలుగో నగరం అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులను వివరించడంపై మంచి స్పందన లభించింది. ప్రతిష్టాత్మాకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణకి పారిశ్రామిక వేత్తల నుంచి మద్దతు లభించిందన్నారు. అమెరికా పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.


కాగా, ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు, చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందన్నారు. ఇక నేటి నుంచి రేవంత్ రెడ్డి సౌత్ కొరియాలో పర్యటించనున్నారు. యూయూ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సీఏం భేటీ కానున్నారు. కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ ప్రతినిధులతో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఎల్ఎస్ హోల్డింగ్స్ కంపెనీతో సమావేశంలో పాల్గొననున్నారు. హ్యుందాయ్ మోటార్స్ సీనియర్ లీడర్షిప్ తో భేటీ కానున్నారు. వాటర్ సర్క్యులేషన్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్ జనరల్‌తో భేటీ కానున్నారు. సౌత్ కొరియా వాటర్ సిస్టం పరిశీలన కోసం సైట్ విజిట్ చేయనున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కొరియా హెరాల్డ్‌కి ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.

Updated Date - Aug 12 , 2024 | 08:05 AM

Advertising
Advertising
<