ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TS Cabinet Meeting: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు

ABN, Publish Date - Aug 01 , 2024 | 06:06 PM

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది.

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ధరణి పోర్టల్ పేరు ‘భూమాత’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.


మిగతా నిర్ణయాలు ఇవే..

  • హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి

  • నిఖత్ జరీన్, సిరాజ్‌లకు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగం

  • జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

  • ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు

  • కొత్త రేషన్ కార్డులకు కేబినెట్ ఆమోదం

  • విధివిధానాల ఖరారుకు మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన కమిటీ.. సభ్యులుగా పొంగులేటి, దామోదర రాజనర్సింహ

  • రేపు సభలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్న ప్రభుత్వం.


  • నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించాలని క్యాబినెట్ నిర్ణయం

  • గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్‌కి రికమండ్ చేయాలని కేబినెట్ నిర్ణయం

  • నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించాలని నిర్ణయం

  • మూసీలో ఎప్పటికీ ఫ్రెష్ వాటర్ ఉండేందుకు తగు నిర్ణయాలు తీసుకున్న కేబినెట్


గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌

అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్‌కి రికమండ్ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. రేపు (శుక్రవారం) అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు విడివిడిగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. రేషన్ కార్డుల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన, దామోదర రాజనరసింహా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా సబ్ కమిటీ ఏర్పాటు చేశామని వివరించారు.

మరోవైపు రాజీవ్ రతన్ కొడుకు హరీ రతన్‌కు మున్సిపల్ కమిషనర్‌గా ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. మరోవైపు గౌరవెల్లి ప్రాజెక్టు కోసం నిధులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు.

Updated Date - Aug 01 , 2024 | 06:50 PM

Advertising
Advertising
<