సీఎం ఆదేశాలు.. ప్రజా బాట పట్టిన మంత్రులు..

ABN, Publish Date - Jul 29 , 2024 | 07:14 AM

అమరావతి: ఈనెల 18 నుంచి కురిసిన వర్షాలతో ఐదు జిల్లాల్లో వ్యవసాయం అస్తవ్యస్తమైంది. వరద పోటెత్తడంతో అనేక ప్రాంతాల్లో పంటలు నీట మునిగి నాశనమయ్యాయి. దీంతో ఆయా జిల్లాల్లో పర్యటించి రైతులకు భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

అమరావతి: ఈనెల 18 నుంచి కురిసిన వర్షాలతో ఐదు జిల్లాల్లో వ్యవసాయం అస్తవ్యస్తమైంది. వరద పోటెత్తడంతో అనేక ప్రాంతాల్లో పంటలు నీట మునిగి నాశనమయ్యాయి. దీంతో ఆయా జిల్లాల్లో పర్యటించి రైతులకు భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దాదాపు వారం రోజులు అసెంబ్లీ సమావేశాల్లో బిజీ బిజీగా గడిపిప మంత్రులు ప్రజాబాట పట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చేందుకు పర్యటనలు చేస్తున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, రామానాయుడుతోపాటు కందుల దుర్గేష్.. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని కుక్కునూరు, వేలేరుపాడు, తణుకు, తాడేపల్లి గూడెం, ఉండ్రాజవరం ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాలు, వరదపోటువల్ల దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలించి రైతులకు కలిగిన నష్టంపై అధికారులతో సమీక్షించారు. అదే విధంగా పునరావాసకేంద్రాలను సందర్శించి ఇళ్లు నీటిలో మునిగిపోయిన కుటుంబాలకు రూ. 3వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆశలు జలసమాధి

జగన్‌ ఇంత పిరికితనమా..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 29 , 2024 | 07:14 AM