కలకలం రేపుతున్న ఎంపీడీవో అదృశ్యం..

ABN, Publish Date - Jul 18 , 2024 | 07:46 AM

విజయవాడ: నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం కలకలం రేపుతోంది. మంగళవారం నాడు ఇంటి నుంచి వెళ్లిన ఆయన కనిపించడంలేదు. నర్సాపురంలో ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆయన సెలవు రోజుల్లో విజయవాడలోని ఇంటికి వస్తుంటారు.

విజయవాడ: నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం కలకలం రేపుతోంది. మంగళవారం నాడు ఇంటి నుంచి వెళ్లిన ఆయన కనిపించడంలేదు. నర్సాపురంలో ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆయన సెలవు రోజుల్లో విజయవాడలోని ఇంటికి వస్తుంటారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టి కానూరు వచ్చారు. 15న మచిలీపట్నంలో పని ఉందంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన వెంకటరమణ.. అదే రోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి తాను బందర్‌లో ఉన్నానని ఇంటికి రావడం ఆలస్యమవుతుందని తెలిపారు. తర్వాత ఆయన ఆచూకి తెలియకపోగా ఫోన్ కూడా పనిచేయలేదు. అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత తన పుట్టిన రోజు.. చనిపోయే రోజని అందరూ జాగ్రత్త అని భార్య ఫోన్‌కు మెసేజ్ పంపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్..

వారి పట్ల రోజా అనుచిత ప్రవర్తన

వెంటనే ఫెర్రీ బకాయి వివరాలు ఇవ్వండి..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 18 , 2024 | 07:46 AM