Andhra Pradesh: 27న రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్
ABN, Publish Date - Mar 24 , 2025 | 03:07 AM
ఇందుకుగాను రూ.1.50 కోట్లు నిధులను విడుదల చేసింది. రంజాన్ నెలలో సాయం కాలం ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించేందుకు నిర్ణయించారు.

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోనూ కార్యక్రమాలు
ఇఫ్తార్ ఏర్పాట్లకు రూ.1.50 కోట్లు విడుదల
అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను రూ.1.50 కోట్లు నిధులను విడుదల చేసింది. రంజాన్ నెలలో సాయం కాలం ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.75 లక్షలు కేటాయించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో కూడా 4, 5 రోజుల్లో జిల్లా స్థాయి ఇఫ్తార్ కార్యక్రమాన్ని వారికి అనువైన రోజున కలెక్టర్ల ఆధ్వర్యంలో పకడ్బందీగా నిర్వహించాలని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు మరో రూ.75 లక్షల మొత్తాన్ని కేటాయించారు.
ఇవి కూడా చదవండి..
Delhi High Court Judge: నోట్ల కట్టల ఆరోపణలు నిరాధారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ
Karnataka: ఘోర ప్రమాదం.. భారీ రథాలు కూలిపోయి.. బాబోయ్..
Navy Employee Case: నాకు ఫుడ్ వద్దు.. డ్రగ్స్ కావాలి.. నిందితురాలి కొత్త డిమాండ్
Updated Date - Mar 24 , 2025 | 03:07 AM