CM Chandrababu Naidu: నేడు కేబినెట్ భేటీ
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:21 AM
వెలగపూడిలో మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. అమరావతి నిర్మాణానికి నిధుల సమీకరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

అమరావతి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంగళవారం మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. సీఆర్డీయే 46 అథారిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సీఆర్డీయే కమిషనర్కు అనుమతి ఇస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..