వరసిద్ధుడి సేవలో హైకోర్టు సీజే
ABN, Publish Date - Feb 10 , 2025 | 01:13 AM
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు చిత్తూరు జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ కుటుంబ సమేతంగా ఆదివారం సాయంత్రం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు. వీరిని ఈవో పెంచలకిషోర్ ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదాశీర్వాద మండపంలో వేదమంత్రాలతో ఆశీర్వదించి.. స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరావు, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ మహే్షకుమార్, ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, ఎస్ఐ ధరణీధర తదితరులు పాల్గొన్నారు.

వరసిద్ధుడి సేవలో హైకోర్టు సీజే
ఐరాల, ఫిబ్రవరి 9 (ఆంద్రజ్యోతి): ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు చిత్తూరు జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ కుటుంబ సమేతంగా ఆదివారం సాయంత్రం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు. వీరిని ఈవో పెంచలకిషోర్ ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదాశీర్వాద మండపంలో వేదమంత్రాలతో ఆశీర్వదించి.. స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరావు, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ మహే్షకుమార్, ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, ఎస్ఐ ధరణీధర తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 10 , 2025 | 01:13 AM