Waqf Amendment Act: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అనంతలో ర్యాలీ
ABN , Publish Date - Apr 14 , 2025 | 02:55 AM
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో పాలస్తీనా జాతీయ జెండా ప్రదర్శన వివాదానికి దారితీసింది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా జెండాలు ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత రావి చైతన్య కిషోర్ డిమాండ్ చేశారు.

పాలస్తీనా జెండా ప్రదర్శనపై వివాదం
అనంతపురం న్యూటౌన్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాలస్తీనా జాతీయ జెండాను ప్రదర్శించడంపై వివాదం చెలరేగింది. ర్యాలీల పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పాలస్తీనా జెండాలను ప్రదర్శిస్తే సహించబోమని బీజేపీ నేత, రాప్తాడు అసెంబ్లీ కన్వీనర్ రావి చైతన్య కిషోర్ స్పష్టంచేశారు. పాలస్తీనా జెండాలను ప్రదర్శించిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For AndhraPradesh News And Telugu News