40 అడుగుల మేర ఎగిసిపడిన మట్టి, నీరు

ABN, Publish Date - Mar 21 , 2025 | 01:56 AM

రాజోలు మండలం కడలిలో ఆక్వా చెరువు వద్ద ఉన్న పాత నీటి బోరును గురువారం రైతు లు పునరుద్ధరించడానికి ప్రయత్నించారు.

40 అడుగుల మేర  ఎగిసిపడిన మట్టి, నీరు

కడలిలో పాతబోరు నుంచి..

40 అడుగుల మేర ఎగిసిపడిన మట్టి, నీరు

రాజోలు, మార్చి 20(ఆంధ్రజ్యోతి): రాజోలు మండలం కడలిలో ఆక్వా చెరువు వద్ద ఉన్న పాత నీటి బోరును గురువారం రైతు లు పునరుద్ధరించడానికి ప్రయత్నించారు. దీంతో భూమి అడుగు పొరల నుంచి మట్టి, నీరు 40 అడుగుల ఎత్తులో ఎగిసి పడింది. స్థానికులు వెంటనే ఓఎన్జీసీ అధి కారులకు సమాచారం అందించారు. ఓఎన్జీ సీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి సిమెంట్‌తో పూడ్చి అదుపుచేశారు. సంఘ టనా స్థలాన్ని రాజోలు తహశీల్దార్‌ ఎన్‌ ఎన్‌ఎస్‌ ప్రసాద్‌ పరిశీలించారు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - Mar 21 , 2025 | 01:56 AM